Share:

Satyanarayana Swamy Vratha Pooja

సత్యనారాయణ స్వామి వ్రత పూజా/ Satyanarayana Swamy Vratha Pooja

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానం …

వ్రతం ఎప్పుడు చేయాలి: సత్యనారాయణస్వామి వ్రతాన్ని దేవాలయాలలో గానీ, పుణ్యక్షేత్రాలలోగానీ, నదీ సాగర సంగమం వద్దగానీ, నదీతీరం వద్దగానీ, గోశాలలో గానీ, తులసివనంలో గానీపూజా స్థలాన్ని ఏర్పాటు చేసి వ్రతం చేసినట్లయితే వెయ్యింతల ఫలితం ఇస్తుంది. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ, సూర్యుడు రాశిమారే సంక్రమణం రోజు (పర్వకాలం) లో చేసినట్లయితే విశేష ఫలితం సిద్ధిస్తుంది. మేష సంక్రాంతి, వృశ్చిక సంక్రాంతి రోజులలోగానీ, పౌర్ణమి, ఏకాదశి తిథులలో కనుక ఆచరించినట్లయితే విశేష ఫలం కలుగుతుంది.

ఇంట్లో ఈశాన్య మూల స్థలాన్ని శుద్ధి చేసి కడిగి, బియ్యంపిండితోగానీ, రంగులతోగానీ ముగ్గులు పెట్టుకోవాలి. మంటపాన్ని శుభ్రంగా కడిగి పసుపురాసి, కుంకుమతో బొట్లు పెట్టి, బియ్యంపిండితో ముగ్గు వేయాలి. మంటపంలో బియ్యంపోసి. కొత్త తువ్వాలుపరిచి సత్యనారాయణస్వామి త్రపటాన్నికానీ,  ప్రతిమనిగానీ ఉంచాలి. తికోణం ఆకృతిలో పసుపుముద్దతో గణపతిని తయారు చేసుకుని దానికి కుంకుమబొట్టు పెట్టుకోవాలి. ఒక పళ్ళెంలో కొత్త తువ్వాలు వేసి దానిపై బియ్యం పోసి దానిపై తమలపాకుపై గణపతిని ఉంచాలి. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. దీపపు కుందులో మూడు అడ్డవత్తులు, ఒక కుంభవత్తిని మధ్యలో వేసి నూనెతో తడపాలి. ఇంకొక వత్తిని నూనెతో తడిపి ఎకహారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు) వేసిం ఏకహారితిలో వేసిన వత్తిని వేగిలించి,దానితో కుడులో ఉన్న ఒక అడ్డవత్తి, కుంభవత్తి వెలిగించి, దానిలో నూనె (నవ్వులనూనె, కొబ్బరినూనె లేకపోతే ఆవునెయ్యి ) నిండుగా వేసుకోవాలి.తరువాత కుందులకు మూడుచోట్ల కుంకుమ బొట్టు పెట్టాలి. దీపారాధన చేసిన తరువాత దీపాలను లక్ష్మీ స్వరూపంగా భావించి నమస్కరించాలి. కుందిలో మిగిలిన రెండు అడ్డవత్తులు పూజా సమయంలో ధూపం చూపించిన తరువాత దీపం చూపించడానికి వాడుకోవాలి. అగరవత్తులు వెలిగించి దూపాన్ని గణపతికి చూపించాలి.

పూజా సామాగ్రి:

మంటపం, బియ్యం, పసుపు, కుంకుమ, కర్పూరం, సాంబ్రాణి, అగరవత్తులు, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు,అరటిపళ్ళు, దీపపు కుందులు, యజ్ఞోపవీతాలు, కొత్త తువ్వాలు (మంటపం లో రవడానికి), పంచామృతం(ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనే, పంచదార), చిల్లర నాణాలు, కలశం, జాకెట్టు ముక్కు (కలశంపై ఉంచడానికి), మామిడి ఆకులు (మంటపానికి, ఇంటి గుమ్మాలను అలంకరించడానికి). చందనం, అక్షింతలు. ప్రసాదం(బొంబాయి రవ్వ, ఖర్జూరం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పంచదార కలిపి ఉంచుకోవాలి). చెంబులో శుభ్రమైన నీళ్ళు,ఉద్దరిన. తువ్వాలు (ఆచమనం చేసిన తరువాత చేతులు తుడుచుకోవడానికి).

కలశం: 

          రెండు వెండి, రాగి లేక స్టీలు చెంబులలో శుద్ధమైన నీళ్ళను తీసుకుని ఒకదానిలో ఉద్దరిని, రెండవ దానిలో అక్షతలు, తమలపాకు, పువ్వు ఉంచుకోవాలి. రెండవ చెంబుకు మూడువైపులా గంధం పూసి, కుంకుమ అద్దాలి. గంధం పూస్తున్నప్పుడు, కుంకుమ పెడుతున్నప్పుడు చెంబుని గుండ్రంగా త్రిప్పకూడదు. గంధం పూసేటప్పుడు ఉంగరపు వేలితో పూయాలి అలాగే కుంకుమ అక్షతలు బొటన, మధ్య, ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించాలి. దంపతులు ఇద్దరూ ఆ కలశాన్ని కుడిచేతితో మూసి …

          కలశస్య ముఖే విష్ణు: కంటే రుద్ర స్సమాస్శ్రితః

          మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః!!

          బుగ్వేదో ధయజుర్వేద స్సామావేదో హ్యధర్వణః

          అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశిత్రాః

          గంగైచ యమునే చైవ కృష్ణే, గోదావరి, సరస్వతీ,

          నర్మదా సింధు కావేరౌయో జలేస్మిన్ సన్నిధంకృ!!

అని చదవాలి.

ఆయాతు శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పూజార్థం మామ దురితక్షయకార కాః కలశో దకేనా ఓం దేవం సామ్ ప్రోక్ష్య అని కలశంలోని ఉదకాన్ని దేవునిపై చిలకరించాలి. ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని ఆ నీటిని తమపై చిలకరించుకోవాలి.ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య అని పూజా ద్రవ్యలపై చిలకరించాలి. కలశంలోని నీళ్ళను పై మంత్రం చదువుతూ పువ్వుతోగానీ, తమలపాకు ఆకుతోగానీ చిలకరించాలి.

మార్జనం:

          ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావ స్థాంగతో పివా

          యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతర శ్ముచి:!!

అని తరువాత కొన్ని అక్షింతలు, పసుపు గణపతిపై వేసి, ఆయనను చేతితో తాకి నమస్కరించి ప్రాణప్రతిష్ఠాపనచేయాలి.

శ్రీ మహాగణాదిపతయేనమః ప్రాణ ప్రతిష్ఠాపాన ముహూస్తాస్తూ ముహూర్తోస్తూ తథాస్తు అని చదువుతూ గణపతికి నమస్కరించాలి.

          శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!

          ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!

          సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః

          లంబో దరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః

          ధూమకే తుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః

          వక్ర తుండ్ర శ్శూర్పకర్ణో హేరంబః స్కంధ పూర్వజః

          షోడ శై తాని నామానియః పటేచ్చ్రణు యాదపి

          విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా

          సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే!!

అధ గణపతి పూజ:

మంత్రః  గణానాం త్వా గణపతిగ్ oహవామహే కవిం కవీనా ముపమశ్ర వస్తవం, జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రాహ్మణ స్పత ఆన స్శ్రణ్వ న్నూతభి స్సీద సాదనం, శ్రీ మహాగణపతియే నమః, ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని గణపతిని మనస్సులో ధ్యానించి నమస్కారం చేయాలి.

శ్రీమహా గణాధిపతయే నమః ఆవాహయామి ఆవాహనార్థం అక్షతాం సమర్పయామి.

దీని ద్వారా మనం మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం. అలా నమస్కారం చేస్తూ అక్షింతలు దేవునిపై వేయాలి.

           శ్రీమహా గణాది పతయే నమః

          నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.

          సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి.

మనం దేవుడు కూర్చోవడానికి బంగారు పీట వేసినట్లు అనుకుంటూ అక్షింతలు వేయాలి.
శ్రీమహా గణాది పతయే నమః పాదయో: పాద్యం సమర్పయామి .

దేవుడు కాళ్ళు కడుగుకోవడానికి నీళ్ళు ఇస్తున్నామని మనసులో అనుకుంటూ పువ్వుతో పంచ పాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలాలి.
శ్రీమహా గణాధిపతయే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

దేవుడు చేతులు కడుగుకోవడానికినీళ్ళు ఇస్తున్నామని మనసులో అనుకుంటూ, ఉద్దరిణితో నీరు వేరొక గిన్నెలో వదలాలి.
శ్రీ మహాగణాదిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.

దేవుడు ముఖం కడుగుకొవడానికి నీళ్ళు ఇస్తున్నామని మనసులో అనుకుంటూ పాత్రలో ఉద్దరిణెతో ఒకసారి నీళ్ళు వదలాలి.

శ్లో       ఆపోహిష్టా మయోభువ స్టాన ఊర్జేత ధాతన, మహేరణాయ చక్షసే, యోవశ్శివత మోర సస్త స్య భాజయ తే హనః, ఉశ తీరివ మాతరః తస్మా దరంగమామ వోయస్యక్ష యాయ జిన్వధ, ఆపోజనయధాచనః, శ్రీ మహాగణాధిపతయే నమః స్నపయామి (స్నానం)శ్రీ మహాగణాధి పతయే నమః స్నానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అని పంచపాత్రలోని శుద్ధనీళ్ళని పువ్వుతో దేవుడిపై చిలకరించాలి.

శ్లో     అభి వస్రాసు వస నాన్యర్ షాభిధే నూస్సు దు ఘాః పూజమానః అభి చంద్రాభర్త వేనొ హిరణ్య భ్యశ్వాన్ రథి నో దేవ సోమ శ్రీ మహా గణాది పతయే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి అంటూ వస్త్రాన్ని(పత్తిని కుంకుమలో అక్కడక్కడా అద్దినట్లయితే అది వస్త్రం అవుతుంది) స్వామీ వారి ప్రతిమకు వేయాలి.
యజ్ఞోపవీతం బరమం పవిత్రం ప్రజాపతే ర్యత్స పూజం పురస్తాత్ ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీ మహా గణాది పతయే నమః ఉపవీతం సమర్పయామి.

అంటే జంధ్యాన్నిఇవ్వాలి. ఇది కూడా పత్తితో చేసుకోవాలి. పత్తిని తీసుకొని పసుపు చేత్తో బొటన వ్రేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి, కుంకుమ అద్దాలి.

శ్లో       యనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ: హ్రదాశ్చ పండరీ కాణి సముద్రస్య గృహ ఇమే శ్రీ మహాగణాధిపతయేనమః దూర్వాణి నానావిధ పుష్పాణి పూజయామి.
ఓం సుముఖాయనమః, ఓం ఏకదంతాయనమః, ఓం కపిలాయనమః, ఓం గజకర్ణాకాయనమః, ఓం లంబోదరాయనమః, ఓం వికటాయనమః, ఓం విఘ్నరాజాయనమః, ఓం గణాధిపతయే నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయనమః, ఓం గజాననాయనమః, ఓం వక్రతుండాయనమః, ఓం శూర్పకర్ణాయనమః, ఓం హేరంభాయనమః, ఓం స్కంద పూర్వజాయనమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయనమః, ఓం మహాగణాధిపతయేనమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి.

శ్లో       వనస్పత్యు ద్భవై ర్దివ్యై ర్నానాగంధ దై స్సు సంయుతః ఆఘ్రేయ స్సర్వ దేవానాం ధూపయం ప్రతిఘ్రు హ్యాతామ్, ఓం శ్రీ మహాగణాధిపతయేనమః దూపమాఘ్రాపయామి.

శ్లో       సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం, గృహాన మంగళం దీపం త్ర్యైలోక్య మిరాపహం, భక్త్యాదీపం ప్రయాచ్చామి దేవాయ పరమాత్మనే, త్రాహిమాం నరకా ద్ఘోరా ద్దివ్య జ్యోతిర్నమోస్తుతే, శ్రీ మహాగణాధిపతయేనమః దీపం దర్శయామి, ధూపదీపానంతరం ఆచమనీయం (చెంబులోని నీళ్ళని స్పూనుతో మూడు మొదటిసారి దోసిలిలో పోసుకుని ప్లేటులో వదిలేయాలి. మూడు సార్లు తీర్థంలా తీసుకుని తరువాత మళ్ళీ ఒకసారి దోసిలిలో నీళ్ళు తీసుకుని ప్లేట్లు వదలాలి) సమర్పయామి.

శ్లో       నైవేద్యం, ‘ఓం భూర్భువ స్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధీ యో యోనః ప్రచోదయాత్,సత్యం త్వర్తేన పరిషించామి,(ఋతం త్వా సత్యేత పరిషించామి అని రాత్రి చెప్పాలి) శ్రీ మహాగణాధిపతయేనమః గుడోపహార నైవేద్యం సమర్పయామి, అమృతమస్తు అమృతో పస్తర ణమసి,ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరుసార్లు చేతితో (చేతిలోని ఉద్ధరిణెతో) స్వామికి నివేదన చూపించాలి.

నైవేద్యం తరువాత ‘హస్తౌ ప్రక్షాళ యామి’అని ఉద్ధరిణెతో పంచపాత్రలోని నీరు ముందు చెప్పిన ఆర్యపాత్రలో వదలాలి. ‘పాదౌ ప్రక్షాళయామి’ అని మరోసారి నీరు ఆర్ఘ్య పాత్రలో ఉద్ధరిణెతో వదలాలి. పునః శుద్ధచమనీయం సమర్పయామి అని ఇంకొక సారి నీళ్ళు వదలాలి.

శ్లో       పూగీ ఫలైస్స కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుక్తం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగ్రుహ్యాతాం
శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి అని చెబుతూ తాంబూలాన్ని (మూడు తమలపాకులు,రెండు పోకచెక్కలు,అరటి పండు వేసి) స్వామి దగ్గర పెట్టాలి.

తాంబూలం వేసుకున్నాక నోరు కడుగుకోవడానికి నీళ్ళు ఇస్తున్నామని మనస్సులో అనుకుంటూ  ‘తాంబూల చరవణా నంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి’ అంటూ ఉద్ధరిణెతో నీరు ఆర్ఘ్య పాత్రలో వదలాలి. కర్పూరం వెలిగించి

శ్లో       ఓం శ్రీ మహాగణాధిపతయే కర్పూర నీరాజనం సమర్పయామి. అని కర్పూర బిళ్ళలు హారతిపళ్ళెంలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి, మూడుసార్లు తిప్పుతూ మెల్లిగా ఘంట వాయించాలి. మళ్ళీ పువ్వుతో నీళ్ళు హారతిపళ్ళెం చివర వదులుతూ ‘కర్పూర నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి’ అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించిన  తరువాత ఇంట్లోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు, పువ్వులు, చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని …

శ్లో       గణానాంత్వా గణపతిగ్ హవామహే కవింక వీనాముపశ్రవస్తవం, జ్యేష్ట రాజం
బ్రహ్మణాం బ్రాహ్మణ స్పత ఆన స్శ్రుణ్య న్నూతభి స్సీద సాదం శ్రీ మహాగణాది పతయే నమః
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.

అని చెప్పి అక్షతలు పువ్వులు చిల్లర స్వామి దగ్గర ఉంచాలి.

శ్లో       మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప, యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తు తై
          అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతయే స్సుప్రీతో వరదో భూత్వా ఉత్తరే కర్మణ్య విఘ్నస్త్వితి భవంతో బ్రువంతు. ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు. గణాధిపతి ప్రసాదం శిరసా ఘ్రుహ్ణమి అని స్వామికి నమస్కరించి, స్వామి దగ్గర ఉన్న పుష్పాన్ని తీసి తలపై ఉంచుకోవాలి లేకపొతే అక్షింతలు తలపై వేసుకోవాలి.

శ్లో       సహస్ర పరమాదేవి శతమూలా శాతాంకురా,సర్వగ్ o హరతుమేపాపం దూర్వాదు స్వప్న నాశనీ, గణపతిం యదాస్థానము ముద్వాసయామి, యజ్ఞేన యజ్ఞ మయం జంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హా నాకం మహిమాన స్పంచతే యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః

శ్లో       యస్శివో నామరూపాభ్యాం యాదేవి సర్వామంగళా, తయో స్సస్మర ణా త్పుంసాం సర్వతో
జయమంగళమ్, లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీ వర శ్యామో హృదయస్థో జనార్దనః ఆ పదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం, లోఖాభి రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, శ్రీ లక్ష్మీ నారాయణాభ్యం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః, శచీ ఓం తత్పురుషాయ విద్యహే వక్రతుండాయ ధీమహి తన్నో దన్తి:ప్రచోదయాత్

ఓం తత్పురుషాయ విద్యహే వక్ర తున్డాయ ధీమహి
తన్నో నన్ది : ప్రచోదయాత్
ఓం తత్పురుషాయ విద్యహే మహాసేనాయ ధీమహి
తన్నో షణ్ముఖః ప్రచోదయాత్
ఓం తత్పురుషాయ విద్యహే సువర్ణ పక్షాయ ధీమహి
తన్నో గరుడః ప్రచోదయాత్
ఓం వేదాత్మనాయ విద్యహే హిరణ్య గర్భాయ ధీమహి
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్
ఓం నారాయణాయ విద్యహే వాసుదేవాయ ధీమహి
తన్నో విష్ణు : ప్రచోదయాత్
ఓం వజ్రనకాయ విద్యహే తీక్షణః దంష్ట్రాయ ధీమహి
తన్నో నారసింహ ప్రచోదయాత్
ఓం భాస్కరాయ విద్యహే లాలీ లాయ ధీమహి
తన్నో అగ్ని : ప్రచోదయాత్
ఓం కాత్యాయ నాయ విద్యహే కన్య కుమారి ధీమహి
తన్నో దుర్గః ప్రచోదయాత్
ఓం మహాదేవ్యైచ విద్యహే విష్ణు పత్న్యైచ ధీమహి
తన్నో లక్ష్మి : ప్రచోదయాత్
ఓం సాయి రామాయ విద్యహే ఆత్మా రామాయ ధీమహి
తన్నో బాబా ప్రచోదయాత్
ఓం సాయీశ్వరాయ విద్యహే సత్య దేవాయ ధీమహి
తన్నః సర్వ ప్రచోదయాత్
ఈశాన స్సర్వ విద్యానాం
ఈశ్వర స్సర్వ భూతానాం
బ్రహ్మాది పతి ర్బ్రహ్మణోధి పతి :
బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం
పురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః, అయం ముహూర్త స్సుముహూర్తో స్తు.

పంచలోక పూజ:

ఈ క్రింది శ్లోకాలను చదువుతూ పంచాలోకాల అధిపతి దేవతలను పూజించాలి.
ఆచమ్య, పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ శ్రీ సత్యనారాయణ వ్రతాంగ గణపత్యాది పంచలోక పాలక పూజాం కరిష్యే.
గణానాంత్వా గణపతిగ్ o హవామహే కవింక వీనాముపశ్రవస్తవం, జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రాహ్మణ స్పత ఆన స్శ్రు న్నూ తిభి స్సీద సాదనం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివార సమేతం గణపతిం లోకపాలక మావాహయామి స్థాపయామి పూజయామి.
ఓం బ్రహ్మ దేవానాం పదవీ :- కవీనా మృషిర్ ప్రాణం మహిషో మృగాణాం శ్యేనో గ్రుధ్రాణాగ్ o
స్వధి తిర్వనానాగ్ o సోమః పవిత్ర మత్యేతి రేభన్, సాంగం సాయుధం సవాహనం సశక్తిం
పత్నీ పుత్ర పరివార సమేతం బ్రహ్మాణం లోకపాలక మావాహయామి స్థాపయామి పూజయామి
ఓం ఇదం విష్ణుర్వి చక్రమే త్రేధా నిదధే పదం, సమూడ మస్య పాగ్ o సురే సాంగం
సాయుధం సవాహనం, సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం విష్ణుంలోక పాలక మావాహయామి స్థాపయామి పూజయామి
ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీడు ష్టమాయ తవ్యసే, వోచేమ శంతమగ్ o హృదే, సాంగం
సాయుధం సవాహనం, సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం
రుద్రం లోక పాలక మావాహయామి స్థాపయామి పూజయామి
ఓం గౌరీ మియాయ సలిలాని తక్ష పడీ ద్విపదీ సాచ తుష్పదీ, అష్టాపదీ నవపదీ
బభూవుషీ సహస్రాక్ష రా పరమేవ్యోమన్, సాంగం సాయుధం సవాహనం, సశక్తిం పత్నీ పుత్ర
పరివార సమేతం గౌరీం లోక పాలక మావాహయామి స్థాపయామి పూజయామి
గణేశాది పంచలోకపాలక దేవతాభ్యో నమః, ధ్యాయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి,పుష్పాణి సమర్పయామి, దూపమాఘ్రాపయామి, దీపందర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి, తరువాత నవగ్రహాలను పేరుపేరునా ఈ క్రింది శ్లోకములను చదువుతూ పూజించాలి.

నవగ్రహ పూజ:

అస్యతే నేత్య మంత్రస్య, హిరణ్యస్తూ ఋషి: సవితాదేవతా, త్రిష్ట ప్చంద:, యాజమాన స్యాధి దేవతాప్రత్యధి దేవతా సహిత సూర్య గ్రహ ప్రసాద సిద్ద్యర్ధే సూర్యగ్రహరాధనే వినియోగః,

శ్లో       వేదీ మథ్యే లలిత కమలే కర్ణ కాయాంరథ స్థ పానాశ్వో రర్కో రుణరుచిన పుస్సప్త జ్జుద్ద్వి బాహు:, గోత్రే రమ్యే బహుఉవిధ గుణే కాశ్యపాఖ్యే ప్రసూతః కాళిం గాఖ్యే విషయ జనితః ప్రాజ్ఞుఖః పద్మహస్తః, పద్మాసనః పద్మకరో ద్విబాహు:పద్మద్యుతి స్సస్త తురంగ వాహః, దివాకరో లోకవపు:, కిరీటి మయి ప్రసాదం విదధాతు దేవః అస్యత్యేన రజసా వర్తమానో నివేశయన్న మృతం మర్త్యంచ, హిరణ్యయేన సవితా రథే నాదేవో యాతి భువనా విపశ్యన్, ఓం భూర్భువస్సువః సూర్యగ్రహగచ్చ:, సూర్యగ్రహం, రక్తవర్ణం, రక్తగంధం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరధరం, రక్తచ్చత్ర ధ్వజ పతాకాది శోభితం దివ్య రథ సమారూడం మెరుం ప్రదక్షిణీ కుర్వాణం, ప్రాజ్ముఖం, పద్మాసనస్థ, ద్విభుజం, సప్తాశ్వం, సప్త రజ్ఞుం కళింగ దేశాది పతిం కాశ్యపసగోత్రం, ప్రభవ సంవత్సరే మాఘసే, శుక్లపక్షే, సప్తమ్యాం, భానువాసరే, అశ్వినీ నక్షత్ర జాతం,సింహరాశ్వధి పతిం, కిరీటినం సుఖాసీనం, పత్నీపుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధి కరణె వర్తూలాకార మండలే స్థాపిత స్వర్ణ ప్రతిమారూపేణ సూర్యగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి ఓం అగ్నిదూతం వృణీమహే హొతారం విశ్వవేద సం అస్య యజ్ఞ స్య సుక్రతుం, సూర్యగ్రహాది దేవటం అగ్నిం సాంగ సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రా పరివార సమేతం సూర్య గ్రహస్య దక్షిణతః అగ్ని మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం కద్రుద్రాయ ప్రచేత సే మీడుష్టమాయ తవ్య సేవో చేమ శాంత మిగ్ o హృదే సూర్యగ్రహ ప్రత్యధి దేవతాం రుద్రం సాంగ సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రా పరివార సమేతం సూర్య గ్రహస్య ఉత్తరతః రుద్ర మావాహయామి స్థాపయామి పూజయామి.
ఆప్యాయ స్వేతస్య మంత్రస్య గౌతమ ఋషి:, చంద్రోదేవతా, గాయత్రీ ఛందః, యాజమాన స్యాధి దేవతా ప్రత్యాధి దేవతాసహిత చంద్రగ్రహ ప్రసాద సిద్ధ్యర్ధే చంద్రగ్రహారాధన వినియోగః

శ్లో       ఆగ్నేయభాగే సరధోధ శాశ్వశ్చా త్రేయజో యామున దేశజశ్చ, ప్రత్యజ్ఞ్మస్థఖ్చ, తురశ్ర పీటే గదాధరాం గోహిమవత్స్వభావః, శ్వేతాంబర శ్వేతపు: కిరీటి శ్వేత ద్యుతి దండధరో ద్విబాహుః, చంద్రో మ్రుతాత్మా వరదః కిరీటీ శ్రేయాంసిహ్యం విదధాతుదేవః, ఓం ఆప్యాయ స్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణి యం భవా వాజస్య సంగధే, ఓం భూర్భువస్సువః చంద్రగ్రహేహగచ్చ, చంద్రగ్రహం, శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వేతపుష్పం, శ్వేతమాల్యాబరధరం, శ్వేతచ్చతరంధ్వజ పటాకాది శోభితం, దివ్యరధ సమారూడం మేరుం ప్రదక్షిణే కుర్వాణం దశాశ్వరథ వాహనం, ప్రత్యజ్ఞుఖం, ద్విభుజందండధరం యాముదేశాది పతి, ఆత్రేయస గోత్రం, సౌమ్య సంవత్సరే, కార్తీకమాసే,శుక్లపక్షే, పౌర్ణ మాస్యాం ఇందువాసరే కృతికా నక్షత్ర జాతం, కర్తరాశ్యది పతిం, కిరీటినం సుఖాసీనం పత్నీ పుత్రా పరివార సమేతం, గ్రహ మండలే ప్రవిష్ట మస్మిన్నధి కరణే సూర్యగ్రహస్యా గ్నేయదిగ్భాగే, సమచతురాస్రమండ లేసాపిత రజత ప్రతిమారూపేణ చంద్రగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అప్సుమేటోమో అబ్రవీ దంతర్విశ్వాని భేషజ, అగ్నిని చ విశ్వశంభువ మాపశ్చ విశ్వభేషజీ: చంద్రగ్రహాది దేవతాః సాంగాః సాయుధాః సవాహనాః స్రశక్తి: పుత్రా పరివార సమేతాః చంద్రగ్రహస్య దక్షిణతః అపః ఆవాహయామి స్థాపయామి పూజయామి, ఓం గౌరీ మియాయ సలిలాని తక్ష త్యేక పడీ ద్విపదీ సా చతుష్పది అష్టాపది నవపదీ బభూవుషీ సహస్రాక్ష రా పరమే వ్యోమన్, చంద్రగ్రహ ప్రత్యధి దేవతాం, సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పుత్రపరివార సమేతాం చంద్రగ్రహస్యో త్తరతః గౌరీ మవాహయామి స్థాపయామి పూజయామి.
అగ్నిర్మూర్ధే త్యస్య మంత్ర స్య విరూప ఋషి: అంగారక గ్రహొ దేవతా త్రిష్టుప్చందః, యాజమాన స్యాధి దేవతా ప్రత్యధి దేవతా సహిత అంగారక గ్రహప్రసాద సిద్ధ్యర్ధే అంగారక గ్రహారాదనే వినియోగః

శ్లో       యామ్యే గదాశక్తి ధరశ్చ శూలివరప్రదో యామ్యముఖో తిరిక్త, కుజస్త్వ వంతీ విషయ స్త్రీకణస్త స్మిన్ భారద్వాజకులే ప్రసూతః రక్తాం బరోరక్త వపు: కిరీటీ చతుర్భుజో మేషగ మో గదా భ్రుత్, ధరాసుత శ్శక్తి ధరశ్చ శూలి సదా మమ స్యా ద్వరదః ప్రశాంతః, ఓం అగ్నిర్మూర్దాదినః కకుత్పతి: పృధి వ్యా అయం ఆపాగ్ రే తాగ్ o సి జిన్వతి, ఓం భూర్భువస్సువః, అంగారక గ్రహే హాగచ్చ, అంగారకగ్రహ, కర్త వర్ణం రక్త గంధం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరధరం, రక్తచ్చత్ర ధ్వజ పతాకాది శోభితం, దివ్యరథ సమారూడం, మేరుం ప్రదక్షిణీ కుర్వాణం, మేషవాహనం, దక్షినాభిముఖం, చతుర్భుజం, గదాశూలశక్తి ధరం, అవంతిదేశాధి పతి, భారద్వాజస గోత్ర, రాక్షసనామ సంవత్సరే, ఆషాడ మాసే, శుక్లపక్షే, దశమ్యాం, భౌమవాసరే, అనూరాధా నక్షత్రజాతం, మేష వృశ్చిక రాశ్యధి పతిం, కిరీటినం సుఖాసీనం, పత్నీ పుత్ర పరివార సమేతం, గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నదీ కరణే, సూర్యగ్రహస్వ దక్షిణదిగ్భాగే త్రికోణాకార మండలే స్థాపిత తామ్ర ప్రతిమా రూపేణ అంగారక గ్రహామావాహయామి స్థాపయామి పూజయామి ఓం స్యోనా ప్రుధీ శీభవా వృక్ష రానివేశనీ, యచ్చా వశ్శర్మ సప్రధాః అంగారక గ్రహాధి దేవతాం, ప్రుధీ వీంసాంగాం, సాయుధాం, సవాహనం,సశక్తి పుత్ర పరివార సమేతాం, అంగారక గ్రహస్య దక్షిణతః ప్రుథి వీ మావాహయామి స్థాపయామి, పూజయామి, ఓం క్షేత్రస్య పతినా వయగ్ o , హితేనే వ జయామసీగా మశ్వం పో షయిత్వా సనో మ్రుడాతీ దృశే, అంగారక గ్రహ ప్రత్యధి దేవతాం,క్షేత్రపాలక, సాంగం సాయుధం సవాహనం సశక్తిం, పత్నీ పుత్ర పరివార సమేతం అంగారక గ్రహ స్యోత్తరతః క్షేత్రపాలక మావాహయామి స్థాపయామి పూజయామి.
అగ్నిర్మూర్ధే త్యస్య మంత్ర స్య విరూప ఋషి: అంగారక గ్రహొ దేవతా త్రిష్టుప్చందః, యాజమాన స్యాధి దేవతా ప్రత్యధి దేవతా సహిత బుధ గ్రహ ప్రసాద సిద్ధ్యర్ధే బుధ గ్రహారాదనే వినియోగః

శ్లో   ఉదజ్ఞ్ముఖో మాగధ దేశ జాతశ్చ ఆత్రేయ గోత్ర స్య శరమండలస్థ, సఖడ్గ చ ర్మో రుగదాధ రోజ్ఞస్త ఈశాన్య భాగే వరద స్సుపీతః, పీతాంబరః, పీతవపు:, కిరీటీ చుత్రభుజో దండ ధర శ్చ సౌమ్యః, చర్మా సిద్రు క్సోమ సుత స్సుమేరు స్సింహధి రూడో వరదో బుధశ్చ, ఓం ఉద్భు థ్య స్వాగ్నే ప్రతిజాగ్రు హ్యేన మిష్టాపూర్తే సగ్ o సృజే ధామ యుంచ పునః క్రున్వగ్ద్ స్త్వా పిత రామ్ యవాన మన్వాతాగ్ సీత్వయితంతు మేతం ఓం భూర్భువస్సువః బుధః గ్రహే హాగచ్చ బుధగ్రహం, పీతవర్ణం,పీతగంధం, పీతపుష్పం, పీతమాల్యాంబరధరం పీతచ్చత్ర ధ్వజపతాకాది శోభితం, దివ్యరథ మారూడం, మేరుం ప్రదక్షిణి కుర్యాణం సింహాసనం ఉదజ్జఖం, మగధదేశాధి పతిం, చతుర్భుజం, ఖడ్గ చర్మాంబరధరం, ఆత్రేయసగోత్రం, అంగీరసనామ సంవత్సరే మార్గ శీర్ష మాసే శుక్లపక్షే సప్తమ్యాం సౌమ్యవాసరే పూర్వాభాద్రా నక్షత్ర జాతం మిథున కన్యారాశ్యధి పతిం కిరీటినం, సుఖాసీనం, పత్నీ పుత్రా పరివార సమేతం, గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధి కరణే సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే, బ్నాకార మండలే, స్థాపిత కాంస్య ప్రతిమా రూపేణ బుధ గ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం, సమూడ మస్య పాగ్ సురే బుధ గ్రహాధి దేవతాం, విష్ణుం, సాంగం, సాయుధం, సవాహనం, సశక్తిం, పత్నీ పుత్రా పరివార సమేతం బుధ గ్రహస్య దక్షిణతః విష్ణు మావాహయామి, స్థాపయామి,పూజయామి, ఓం సహస్ర శీర్షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్, సభూమిం విశ్వతో వృత్వా, అత్యతిష్ట దశాంగులం, బుధ గ్రహ ప్రత్యధి దేవతాం నారాయణం, సాంగం, సాయుధం, సవాహనం, సశక్తిం, పత్నీ పుత్ర పరివార సమేతం బుధ గ్రహస్యో త్తరతః నారాయణ మావాహయామి స్థాపయామి పూజయామి.

బృహస్పతి అతి యదర్యే త్యస్య మంత్రస్య, గ్రుత్స్న మదఋషి, బృహస్పతి గ్రహొ దేవతా, త్రిష్టుప్చందః, యాజమాన స్యాధి దేవతా ప్రత్యాధి దేవతా సహిత బృహస్పతి గ్రహ ప్రసాద సిద్ధ్యర్ధే బృహస్పతి గ్రహారాధనే వినియోగః

శ్లో       సౌమ్యే సుదీర్ఘే చతురస్ర పీటే రథే జ్గిరాః పూర్వముఖ స్వభావః త్రిదండాక్ష మాలాజలపాత్ర ధారీ, సిందాఖ్య దేశే వరద స్సుజీవః పీతాంబరః పీతవపు: కిరీటీ చతుర్భుజోదేవః గురు: ప్రశాంతః గదాసిదండం చ కమండలం చ త ధాక్ష సూత్రం వరదో స్తు మహ్యం ఓం బృహస్పతే అతియదర్యో అర్హాద్యు మద్విభాతి క్రతు మజ్జనేషు, యద్గిదయచ్చ వసర్త ప్రజాత దతస్మా సుదర విణం దేహి చిత్రం ఓంభూర్భువస్సువః బృహస్పతి గ్రహేహాగచ్చ, బృహస్పతి గ్రహం, పీతవర్ణం, పీతగంధం, పీతపుష్పం, పీతమల్యాంబరధరం, పీతచత్ర ధ్వజ పతాకాది శోభితం దివ్యరధ సమారూడం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం, పూర్వాభి ముఖం పద్మాసన స్థం, చతుర్భుజం, దండాక్షమాలా ధారిణం, సింధుద్వీప దేశాధి పతిం, అంగీరస గోత్రం, అంగీరస నామ సంవత్సరే వైశాఖమాసే శుక్ల పక్షే ఏకాద శ్యాం గురువాసరే ఉత్తరానక్షత్ర జాతం, ధనుర్మీన రాశ్యాధి పతిం, కిరీటినం, సుఖాసీనం, పత్నీ పుత్ర పరివార సమేతం, గ్రహమండలే ప్రవిష్ట మస్మి న్నధి కరణే సూర్యగ్రహస్యోత్తర దిగ్భాగే దీర్ఘ చతురస్ర మండలే స్థీ పిత త్ర పు ప్రతిమారూపేణ బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్వి సీమత స్సురు చోవేన ఆపః, సబుధ్నీయా ఉత్తమా అస్య విష్టా స్సత శ్చ యోనిమ సతః శ్చ వివః బృహస్పతి గ్రహాధి దేవతాం బ్రాహ్మణం సామ్గం, సాయుధం, సవాహనం, సశక్తిం, పత్నీ పుత్ర పరివార సమేతం బృహస్పతి గ్రహస్య దక్షిణతః బ్రాహ్మణ మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇంద్రం వో విశ్వత స్పరి హవామ హే జనేభ్యః అస్మాక మస్తు కేవలః, బృహస్పతి గ్రహ ప్రత్యధిదేవతాం,ఇంద్రు, సాంగం, సాయుధం సవాహనం, సశక్తిం, పత్నీ పుత్ర పరివార సమేతం బృహస్పతి గ్రహస్య ఉత్తరతః, ఇంద్ర మావాహయామి స్థాపయామి పూజయామి.

శుక్రంతే అన్యది త్యస్య మంత్రస్య, భరద్వాజ ఋషి:, శుక్రగ్రహొ దేవతా త్రిష్టుప్చంద యాజమాన స్యాధి దేవతా ప్రత్యధి దేవతా సహితా శుక్ర గ్రహ ప్రసాద సిద్ధ్యర్ధే శుక్ర గ్రహరాధనే వినియోగః

శ్లో       ప్రాచ్యాం  భ్రుగుర్భో జకటి ప్రదేశ సస భార్గవః పూర్వము స్వభావం, స పంచ కోణే శ ర ధాధి రూడో దండాక్షమాలా వరదోంబుపాత్ర, శ్వేతాంబరః శ్వేతవపు:, కిరీటీ చతుర్భుజో దైత్య గురు: ప్రశాంతః గదాసిదండ చక్ర మండలం చత ధాక్ష సూత్రం వరదో స్తు మహ్యం, ఓం శక్రం తే అన్యద్యంజతం అన్య ద్విషురూపే ఆహవీ ద్యౌరి వాసి విశ్వాహి మాయా అవసి స్వథావో భద్రాతే పూషన్ని హ రాతిరస్తు, ఓం భూర్భువస్సువః, శుక్రగ్రహేగచ్చ, శుక్రగ్రహం, శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వేతపుష్పం, శ్వేత మాల్యాంబరధరం, శ్వేతచ్చ త్ర ధ్వజ పతాకాది శోభితం దివ్యరథ సమారూడం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం పూర్వాభిముఖం, పద్మాసనస్థం, చతుర్భుజం దండాక్ష మాల జతావల్కల థారిణం, కాంభోజ దేశాధిపతి, భార్గవస గోత్రం, పార్ధివ సంవత్సరే శ్రావణమాసే శుక్ల పక్షే, అష్టంయాం భ్రుగువాసరే, స్వాతీ నక్షత్ర జాతం తులా వృషభ రాశ్యాది పతిం కిరటినం సుఖాసీనం పత్నీ పుత్ర పరివార సమేతం శుక్రగ్రహస్య దక్షిణతః ఇంద్రాణీ మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇంద్ర మరుత్వంత మిహ పాహి సోమం యథా శార్యాతే అషిబ స్సుతస్య, తవ ప్రణీతీ తవ శూర శార్మన్నా వివాసంతి క వ య స్సు యజ్ఞాః, ల్శుక్రగ్రహ ప్రత్యధి దేవతాం ఇంద్ర మరుత్వంతం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం శుక్రగ్రహస్య ఉత్తరతః ఇంద్ర మరుత్వంత మావాహయామి స్థాపయామి పూజయామి.
శమగ్ని రగ్నిభి రిత్యస్య మంత్రస్య, హిళి భి ఋషి:, శ నైశ్చ రగ్ర హొ దేవతా, ఉష్ణి క్చందః, యాజమాన స్యాధి దేవతా ప్రత్యధి దేవతా సహిత శనై శ్చ రగ్ర హ ప్రసాద సిద్ధ్యర్ధే శనై శ్చర గ్రహారాధనే వినియోగః,

శ్లో       చాపాసనో రథ స్సునీలః ప్రత్య జ్ఞ్ముఖ కాష్యపజః ప్రతీచ్యాం, సశూల చాపేషు వర ప్రద శ్చ సౌరాష్ట్ర దేశే ప్రభవ శ్చ సౌరీ, నీలద్యుతి ర్నీలవపు:, కిరీటి గ్రుద్ర స్థిత శ్చా ప కర్త్రో ధను ష్మాన్, చతుర్భుజ స్సూర్య సుతః ప్రశాంత స్సచాస్తూ మహ్యం వరమంద గామీ. ఓం శమగ్ని రగ్నిభి స్క్ర చ్చన్న స్త పతు సూర్యః, శంవాతో వాత్వర పా పశ్రిధః, ఓం భూర్భువస్సువః, శనైశ్చర గ్రహేహాగచ్చ, శనై శ్చ ర గ్రహం నీలవర్ణం, నీలగంధం,నీలపుష్పం, నీలమాల్యాంబరధరం, నీలచ్చత్ర ధ్వజపతాకాది శోబితం, దివ్య రథ సమారూడం, మేరుం ప్రదక్షిణి కుర్వాణం చాపాసనస్థం ప్రత్యజ్ఞ్ముఖం, గ్రధ్ర రథం, చతుర్భుజం శూలాయుధ ధరం, సౌరాష్ట్ర దీశాదిపతిం, కాశ్యపసగోత్రం విభవ సంవత్సరే పౌష్యమాసే శుక్లపక్షే నవమ్యాం స్థిరవాసరే భరణీ నక్షత్ర జాతం మకర కుంభ రాశ్యధిపతిం, కిరీటినం సుఖాసీనం పత్నీ పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్ట మస్మి న్నధి కరణే సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే దనురాకార మండలే స్థాపిత అయః ప్రతిమా రూపేణ శనైశ్చర గ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం యమాయ సోమగ్ సునుత యమాయ జుహుతాహవి, యమాగ్ o హయజ్ఞో గచ్చ త్యగ్నిదూతో అరంక్రుతః శ నైశ్చర గ్రహాధి దేవతాం యమం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం సనైశ్చర్య గ్రహస్య దక్షిణతః యమమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ప్రజాపతే నటవ దేవతా న్యనో విశ్వజాతాని పరితాబభూవ యత్కామాస్తే జుహు మస్తనో అస్తు వయగ్గ్ స్యామ పతియోర యీణాం, శనైశ్చర గ్రహస్యోత్తరతః, ప్రజాపతి మవాహయామి స్థాపయామి పూజయామి.

కాయాన శ్చిత్రే త్యస్య మ మంత్రస్య, వామదేవ ఋషి:, రాహుగ్రహొదేవతా, గాయత్రీ చ్చందః, యజమానస్యాది దేవతా ప్రత్యధి దేవతా సహిత రాహుగ్రహ ప్రసాద సిద్ద్యర్ధే రాహుగ్రహరాధనే వినియోగః

శ్లో   పైటో న సో బర్బర దేశ స్శూర్పా సనస్సింహగత స్వభావః యామ్యాననో నైరుతి దిక్కరాశో వరప్రద స్శూల సచర్మ ఖడ్గః, నీలాంబరో నేలవపు: కిరీటీ కరాళ వక్త్రః కరవాల శూలీ, చతుర్భుజ శ్చరధర్మశ్చ రాహు సింహాధి రూడో వరదో స్తు మహ్యం, ఓం కాయాన శ్బిత్ర అభువ దూతీ సదా వృధ స్సఖా, కయాష చిష్ట యా వృతా, ఓం భూర్భువస్సువః, రాహుగ్రహే గచ్చ రాహుగ్రహం, నీలవర్ణం, నీలగంధం, నీలపుష్పం, నీలమాల్యాంబరధరం, మేరుమ ప్రదక్షిణీ కుర్వాణం నైర్ ఋతిముఖం, శూర్పా సన స్థం చతుర్భుజం, కరాళ వక్త్రం ఖడ్గ చర్మధరం, పైటీవ స గోత్రం బర్బర దేశాధిపతిం, రాక్షస నామ సంవత్సరే, భాద్రపద మాసే,కృష్ణ పక్షే, చతుర్దశ్యాం, భానువాసరే విశాఖా నక్షత్ర జాతం, సింహరాశి ప్రయ్క్తం కిరీటినం సుఖాసీనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధి కరణే సూర్యగ్రహ్స్య నైర్ రుతి దిగ్భాగే శూర్పాకార మండలే స్థాపిత లోహప్రతి రూపేణ రాహుగ్ర హ మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అయంగౌ: వ్రుశ్ని రక్ర మీద సదన్మాకర స్సువః, పీతరం చ ప్రియం త్సువ రాహు గ్రహాది దేవతాం సర్పాం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం రాహుగ్రహస్య దక్షిణతః సర్పాంసాగ మావాహయామి స్థాపయామి పూజయామి, ఓం నమో అస్తు సర్పే భ్యో యే కేచ పృధి వీ మనుయేం తరిక్షే యేది వితే భ్య స్సర్వేభ్యో నమః రాహుగ్రహ ప్రత్యధి దేవతాం సర్పాం సాంగం సాయుధాం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం రాహుగ్రహస్య ఉత్తరతః సర్పమావాహయామి స్థాపయామి పూజయామి.
కేతుం కృణ్వన్నిత్య స్య మంత్రస్య, మధుచ్చంద ఋషి:, కేతుగ్రహొ దేవతా గాయత్రీ చ్చందః, యాజమాన స్యాధి దేవతా ప్రత్యధి దేవతా సహిత కేతుగణ ప్రసాద సిద్ధ్యర్ధే కేతుగణారాదనే వినియోగః,

శ్లో       ధ్వజాసనో జైమిని గోత్ర ర్వేదే షుదే శే షు విచిత్ర వర్ణః, యామ్యాసనో వాయుదిశః ప్రఖడ్గ శ్చ ర్మా సిభి శ్చా శన మతశ్చ కేతు:, ధూమ్రో ద్విబాహు ర్వర దో గదా భ్రుద్గ్ర ధ్రాపన స్థో వికృతాన శ్చ కిరీటకే యూ విభూషితాంగ స్సచాసుమే కేతుగణః ప్రశాంతః, ఓం కేతుం క్రుణ్వన్న శేతవే పేశో మర్త్వా ఆపేశ సే సముషద్భి రాజా యథాః, ఓం భూర్భువస్సువః, కేతుగానేహాగచ్చ, కేతుగణం, చిత్రవర్ణ, చిత్రగంధం, చిత్రపుష్ప, చిత్రమాల్యాంబరధరం చిత్ర చ్చత్ర ద్వజ పతాకాది శోభితం దివ్యరథ సమారూడం మేరు మప్రదక్షిణీ కుర్వాణం ధ్వజాసన స్థం దక్షిణాభి ముఖం అంతర్వేది దేశాధిపతిం ద్విబాహుం గదాధరం జైమిని గోత్రం రాక్ష సనామ సంవత్సరే చైత్ర మాసే కృష్ణ పక్షే చతుర్ధశ్యా మిందువాసారే రేవతీ నక్షత్రజాతం కర్కాటకరాశి ప్రయుక్తం సింహాసనాసీనం గ్రహమండలే స్థాపిత పంచలోహ ప్రతిరూపేణ కేతుగణ మావాహయామి స్థాపయామి పూజయామి:, ఓం సచిత్ర చిత్రం చితయంత మస్మే చిత్ర పక్షత్ర చిత్రత మం వయోధాం చంద్రం రయిం పురువీరం బృహంతం చంద్ర చంద్రాభి ర్గ్రణతే దువస్వ కేతు గణాది దేవతాం చిత్రగుప్తం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం కేతు గణస్య దక్షిణతః చిత్రగుప్త మావాహయామి, స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మ దేవతానాం పదవీ: కవీనామృషిర్వి ప్రాణాం మహిషో మృగాణాం, శ్యేనో గృథ్రాణాగ్ స్వథితి ర్య నానాగ్ సోమః పవిత్ర మత్యేతి రేభన్, కేతు గణ ప్రత్యధి దేవతాం బ్రాహ్మణం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం కేతుగణ స్యోత్తరతః బ్రాహ్మణ మావాహయామి స్థాపయామి పూజయామి.

అధి దేవతా ప్రత్యధి దేవతా సహిత అది త్యాది నవగ్రహ దేవతా భ్యో నమః ధ్యాయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్దాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, దూపమా ఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి.
అధి దేవతా ప్రత్యధి దేవతా సహిత అది త్యాది నవగ్రహ దేవతా ప్రసాద సిద్ధిరస్తు అని నమస్కరించిన తరువాత అష్ట దిక్పాలకులను ఆహ్వానించునట్లుగా ఎనిమిది వైపులా తాంబూలాలను పెడుతూ ఈ క్రింది విధంగా పూజించాలి.

ఇంద్రాద్యష్ట దిక్పాలక పూజా :

ఓం ఇంద్రంవో విశ్వత స్పరీ హవామ హే జనేభ్యః అస్మాక స్తు కేవలం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం ఇంద్రం దిక్పాలక మావాహాయామి స్థాపయామి పూజయామి.
ఓం అగ్నిం దూతం వృణీ మహే హొతారం విశ్వవేద సం, అస్య యజ్ఞస్య సుక్రతుం, సాంగం సాయుధం, సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం అగ్నిం దిక్పాలక మావాహాయామి స్థాపయామి పూజయామి.
ఓం యమాయ సామగ్ o సునుత యమాయ జుహుతాహవి: యమగ్ o హయజ్ఞో గచ్చత్య గ్నిందూతో అరంక్రుతః సాంగం సాయుధం, సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం యమం దిక్పాలక మావాహాయామి స్థాపయామి పూజయామి.
ఓం మోషుణః పరాపరానిర్ ఋతి ర్దుర్హ ణా వదీత్ పదీ ష్ణ తృష్ణ యా సహ సాంగం సాయుధం, సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం నిర్ఋతిం దిక్పాలక మావాహాయామి స్థాపయామి పూజయామి.
ఓం ఇమం మే వరుణ శ్రుదీ హావ మద్యా చ మృడయ, త్వా మనస్యు రాచకే, సాంగం సాయుధం, సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం వరుణం దిక్పాలక మావా హాయామి స్థాపయామి పూజయామి.
ఓం తవవాయవ నృత స్పతే త్వ ష్ణు ర్జా మాతర ద్బుత ఆవాం స్యా వృణీ మహే సాంగం సాయుధం, సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం వాయుం దిక్పాలక మావాహాయామి స్థాపయామి పూజయామి.
ఓం సోమేధే నుగ్ సోమో అర్వంత మాశుగ్ సోమో వీరం కర్మణ్యం ద దాతు, సాదన్యం విత థ్యగ్ సభే యం పితు స్శ్రువణం యోద దాశ దస్మై సాంగం సాయుధం, సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం కుబేరం దిక్పాలక మావాహాయామి స్థాపయామి పూజయామి.
ఓం తమీశానం జగత స్థ స్తు షప్షతిం ధి యంజిన్వ మన సే హూమ హే వయం, పూషానో యధా వేద సామ సద్వ్రధే రక్షితా పాయు రదబ్ద స్స్వస్తయే సాంగం సాయుధం, సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం ఈశానం దిక్పాలక మావాహాయామి స్థాపయామి పూజయామి.
ధ్యాయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి,ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్దాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి,యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షాతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, దూపమా ఘ్రాపయామి, దీపం దర్శయామి,నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి.

శ్రీ సత్యనారాయణ పూజ తరువాత సత్యనారాయణ ప్రతిమను తమలపాకులో ఉంచి ఈ క్రింది విధంగాగా పంచామృతములతో శోధనము చేయాలి.

ఆప్య్యాయ స్యేతి క్షీర, ఆప్య్యాయశ్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణియం, భవావాజస్య సంగధే

దధి క్రావుణ్నో ఇతి దధి, క్రావున్నో అకారి షం, జిష్ణోక శ్వ స్య వాజినః సురభి నో ముఖాకర త్ర్పణ ఆయూగ్ షి తారి షత్,శుక్రమసీత్యాజ్యం, శుక్రమసి జ్యోతిరపితేజోసి దేవో వస్స వితో త్పునా త్వచ్చి ద్రేణ పవిత్రేణ వసో సూర్యర్యరశమిభి:మధువాటా ఋతాయేతి మధు, మధు వాటా ఋతాయే మధుక్షరంతి సింధవః, మాధ్వీర్న స్సంత్యో షది:, మధుసక్తముతో ష్ణ సి మధుమత్పార్ది వగ రజః, మధుదౌరస్తునః పితా, మధుమాన్నోవనస్పతిర్మధుమాగ్ అస్తు సూర్యః, మాద్విర్గావో భవంతునః, స్వాదు పవ స్వేతి శుద్దోదకం, స్వాదు: పవ స్య డి వ్యాయా జన్మనే స్వాదురింద్రాయ సుహావేతునామ్నే, స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్ o అద్యాభః, ఆపోహిష్టేతి శుద్దోదక స్నానం, ఆపోహిష్టా మయోభువస్తావ ఊర్నే దధాతన, మహేరనాయ చక్షసే, యోవ శ్శివ తమోర సస్త స్యభాజయతే హనః, ఉశతీరివ మాతరః, తస్మా అరంగ మామవో యస్య క్ష యాయ జిన్వధ, అపోజనయదాచనః ప్రాణప్రతిష్టాపనం కరిష్యే
ఓం అస్య శ్రీ ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వరాఋషయః, రుగ్యజుస్సామాధర్వణాన చందాంసి,ప్రాణ శ్శక్తి:, పరాదేవతా హ్రాం బీజం, హ్రీం శక్తి:, క్రోం కీలకం, శ్రీ సత్యనారాయణ ప్రాణ ప్రతిష్టా జపే వినియోగః హ్రాం అంగుష్టాభ్యాం నమః, హ్రీం తర్జనీభ్యాం నమః, హ్రూం మధ్యమాభ్యాం నమః, హ్రైం అనామికాభ్యాం నమః, హ్రౌం కనిష్టికాభ్యాం నమః, హ్రాం కరతలకర ప్రుష్టాభ్యాం నమః, హ్రాం హృదయాయ నమః, హ్రీం శిరసే స్వాహ, హ్రూం శికాయై వషట్, హ్రైం కవచాయ హుం, హ్రౌం నేత్రత్రయాయ వౌషట్, హ్రః అస్త్రాయ ఫట్, భూర్భువస్సువరో మితి దిగ్భందః
ధ్యానం

శ్లో       శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృ ద్ద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాధం ఓం హ్రాం హ్రీం క్రోం యం రం లం వం శం షం హం ళం క్షం శ్రీ సత్యనారాయణ ప్రాణ ఇహ ప్రాణ ఓం హ్రాం హ్రీం క్రోం శ్రీ సత్యనారాయణ సర్వెంద్రియాణి వాజ్మ నశ్చ క్షు స్శ్రోత్ర జిహ్వ ఘ్రాణ, ఇహై వాగత్య సుఖం చిరంతిష్టంతు స్వాహ, ఓం ఆసునీతే పునరస్మాసు చక్షు: పునః ప్రాణ మహినో దేహిభోగం జ్యోక్ప శ్యేమ సూర్య మచ్చరంత మనుమతే మ్రుడయాన స్స్వస్తి అమృతం వైప్రాణ అమృత మాప,ప్రాణానేన యథా స్థానముపహ్వాయతే, సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం శ్రీ సత్యనారాయణ మావాహయామి స్థాపయామి, పూజయామి

అని శ్రీ సత్యనారాయణస్వామిని ధ్యానిస్తున్నట్లు నమస్కారం చేయాలి.
ధ్యానం

శ్లో ధ్యాయేత్స త్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం, లోకనాథం త్రిలోకేశం సౌస్తుభాభరణం హరిం, పీతాంబరం నీలవర్ణం శ్రీవత్స పతకభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మద్యై రభి పూజితం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ధ్యానం సమర్పయామి

అని శ్రీ సత్యనారాయణస్వామిని మనస్సులో ధ్యానించి నమస్కరించాలి.

ఆవాహనం

శ్లో       ఓం సహస్రశీర్ షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్, సభూమిం విశ్వతో వృత్వా. అత్యతిష్టద్దశాంగులమ్.       జ్యోతిస్సాంతిం సర్వలోకాంతరస్థ మొకారాఖ్యం యోగి హృద్ధ్యాన గమ్యం, సాంగం శక్తిం సాయుధం భక్తి సేవ్యం సర్వాకారం విష్ణు మావాహాయామి. శ్రీ సత్యనారాయణ స్వామినినే నమః ఆవాహయామి ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి

అంటే మనస్పూర్తిగా దేవుడిని ఇంట్లోకి ఆహ్వానించడం. అలా మనస్సులో స్మరిస్తూ అక్షింతలు దేవుడిపై వేయాలి.
ఆసనం:

శ్లో      ఓం పురుష ఏ వేదగ్ సర్వం, యద్భూతం యచ్చ భవ్యం, ఉతా మృతత్వ స్యేశానః యద న్నేనాతిరో హతి      కల్పద్రుమూలే మణివేది మధ్యే సింహాసనం స్వర్ణ మాయం విచిత్రం, విచిత్ర వస్త్రా వృత మచ్యుత ప్రభోగ్రు హన లక్ష్మీ ధరణీ సమన్విత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి. దేవుడు కూర్చోవడానికి బంగారు పీట వేసినట్లు అనుకుంటూ అక్షింతలు వేయాలి.
పాద్యం:

శ్లో     ఏతావాన స్య మహిమా ఆతో జ్యాయాగ్ శ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని, త్రిపాద స్యా మృతం దివి. నారాయణ నమస్తే స్తు నరకార్ణ వతారక, పాద్యం గృహాణ దేవేశ మామ సౌఖ్యం వివర్దయ శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పాదౌ: పాద్యం సమర్పయామి. దేవుడు కాళ్ళు కడుగుకోవడానికి నీళ్ళు ఇస్తున్నామని మనసులో అనుకుంటూ పువ్వుతో పంచపాత్రలోని నీళ్ళని అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలాలి.
అర్ఘ్యం:

శ్లో     త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుష:, పదో స్యేహ భవాత్పునః, తతో విశ్వజ్వ్య క్రామత్ సాశనాశనే అభి. వ్యక్తా వ్యక్త స్వరూపాయ హృషీక పతయే నమః మయా నివేదితో భక్యా హ్యార్ఘోయం ప్రతిగృహ్యాతాం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః హస్తౌ : అర్ఘ్యం సమర్పయామి. దేవుడు చేతులు కడుగుకోవడానికి నీళ్ళు ఇస్తున్నామని మనసులో తలుచుకుంటూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతో ఒకసారి నీళ్ళు వదలాలి.
స్నానం:

శ్లో      యత్పురుషేణ హవిషా, యజ్ఞమతన్వత, వసంతో అస్యాసీదాజ్యం, గ్రీష్మ ఇద్మ స్శర ద్దవి:, తీర్దో దకై: కాంచన కుంభ సంస్థై స్సువాసితైర్ధే వక్రుపార సార్ధ్యే, మయార్పితం స్నాన మిదిం గృహాణ పాదాబ్జ నిష్యూత నదీ ప్రావాహ శ్రీ సత్యనారాయణ స్వామినే నమః స్నపయామి

అని పంచపాత్రలోని నీళ్ళని పువ్వుతో దేవుడిపై చిలకరించాలి.

పంచామృతస్నానం:

ఆప్యాయస్య సమేతుతే విశ్వత స్సోమవ్రుష్ణి యం. భావా వాజస్య సంగధే, దధి క్రావుణ్నో అకారిషం జిష్ణోర శ్వస్య వాజినః సురభినో ముఖాకారత్ప్రన అయూగ్ షితారిషత్, శుక్ర మస్మిజ్యోతిరసి తేజోసి దేవో వ స్సవితో త్పునా త్వ చ్చ ద్రేన పవిత్రేనా వసోస్సోర్యస్య రశ్మిభి, మధువాటా ఋతాయతే మధుక్షరంతి సింధవః, మధ్విర్నస్సషంతోధి:మధుసక్తముతో శశి మధుమ త్పార్దివగ్ రజు, మధుధ్యౌరస్తునః పితా, మధుమానో వనస్పతి ర్మధు మాగ్ అదాభ్యః స్నానం పంచామ్రుతై ర్దేవ ఘ్రుహాన పురుషోత్తమ, అనాధనాథ సర్వజన గీర్వాణ ప్రణతిప్రియః శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానానికి పంచామృతాలతో కూడిన నీళ్ళు ఇస్తున్నట్లు భావించి ఆవునెయ్యి, ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె,పంచదార కలిపిన పంచామృతాన్ని స్వామిపై ఉద్దరిణెతో చిలకరించాలి.

శుద్దోదక స్నానం:

శ్లో       ఆపోహిష్టామాయో భువ స్తాన ఊర్జెదధాతన, మహేరణాయ చక్షసే యోవస్శివత మోర సస్త స్యభాజయతే హనః ఉశతీరివమాతరః తస్మాదరంగ మామవోయస్య క్ష యాయ జన్వధ, ఆపోజనయతాచనః, నదీనాం చైవ సర్వాసామానీతం నిర్మలోదకం, స్నానం స్వీకురు దేవేశ మయాదత్తం సురేశ్వర, శ్రీ సత్యనారాయణ స్వామినే నమః శుద్దోదక స్నానం సమర్పయామి అని పంచపాత్రలోని నీళ్ళని పువ్వుతో దేవుడిపై చిలకరించాలి.

వస్త్రం:

శ్లో       సప్తాస్యా సన్పరిధయః త్రిస్సాప్త సమిధః కృతాః దేవాయద్యజ్ఞా తన్వానాః అబత్నం న్పురుషం పశుం. వేదసూక్త సమాయుక్తే యజ్ఞం సామసమంవితే సర్వవర్ణ ప్రదే దేవవాససీతే వినిర్మితే శ్రీ సత్యనారాయణ స్వామినే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి అనుచు వస్త్రమును (పత్తిని బొట్టు బిళ్ళ ఆకారములో గుండ్రముగా చేసుకొని కొద్దిగా తడి చేసి కుంకుమలో అద్దినట్లయితే అది వస్త్రం అవుతుంది) స్వామివారి ప్రతిమకు వేయాలి.

యజ్ఞోపవీతం:

శ్లో      తవయజ్ఞం బర్హిషిప్రౌక్షణ్, పురుషం జాత మగ్రతః తేన దేవాయజంత, సాధ్యా ఋషయ స్చయే, బ్రహ్మవిష్ణు మహేశానాం నిర్మితం బ్రహ్మసూత్రకం, ఘ్రుహాన భగవన్ విష్ణో సర్వేష్ట ఫలదో భవ శ్రీసత్యనారాయణ స్వామినే నమః ఉపవీతం సమర్పయామి అంటే జంధ్యాన్ని ఇవ్వాలి. ఇది కూడా పత్తితో చేయవచ్చు. పత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి, కుంకుమ అద్దాలి.

గంధం:

 శ్లో     తస్మాద్య జ్ఞాత్సర్వ హుత సంభ్రుతం వ్రుషదాజ్యం, పాశూగ్ స్తా గ్ శ్చ క్రే వాయ వ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాస్చయే, శ్రీ ఖండం చందనం దివ్యం గందాడ్యం సుమనోహరం, విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతిగృహ్యాతాం, శ్రీ సత్యనారాయణ స్వామినే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి గంధాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితో స్వామివారి ప్రతిమపై చిలకరించాలి.

ఆభరణం:

శ్లో     తస్మాద్య జ్ఞాత్సర్వ హుతః, రుచస్సామాని జజ్ఞిరే, చందాగ్ సి జజ్న రె తస్మాత్ యజుస్త స్మాద జాయత.
హిరణ్యహర కేయూర గ్రైవేయ మనికంకణై:, సుహారం భూషనై ర్యుక్తం గృహాన పురుషోత్తమ శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ఆభరణం సమర్పయామి స్వామింకి శక్తికి తగినట్లుగా బంగారంగాని, వెండి గాని ఆభరణాలను చేయించినవి స్వామి దగ్గర పెట్టి పూజించాలి.

పుష్పం:

శ్లో      తస్మాదశ్వా అజాయంతః యేకే చొ భ యాదతః, గావో హి జజ్ఞిరే తస్మాత్, తస్మాబ్జాటా అజావయః, మల్లికాది సుగంధాని మాలత్యాదీని మే ప్రభో, మయాహృతాని పూజార్ధం పుష్పాణి ప్రతిగృహ్యాతాం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పుష్పాణి సమర్పయామి అని, స్వామికి పువ్వులతో అలంకరించాలి. పువ్వులతో పూజించాలి.
తరువాత ఆధాంగ పూజ చేయాలి. ఈ క్రింది నామాలను చదువుతూ పుష్పాలతోగాని, కుంకుమతోగాని స్వామిని పూజించాలి.

అథాంగ పూజా:

ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి, ఓం గోవిందాయ నమః గుల్పౌ పూజయామి, ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి, ఓం అనఘాయ నమః జానునీ పూజయామి, ఓం జనార్ధనయ నమః ఊరుం పూజయామి, ఓం విష్టర స్రావ సేనమః కటిం పూజయామి, ఓం కుక్షి స్తాఖిల భువనాయ నమః ఉదరం పూజయామి, ఓం లక్ష్మీ వక్ష స్థలాలయాయ నమః వక్షస్థలం పూజయామి, ఓం శంఖ చక్ర గదాశారజ్గ పానయే నమః బాహూన్ పూజయామి, ఓం కంబుకంటాయ నమః కంటఓ పూజయామి, ఓం పూర్ణేందు నిభావక్త్రాయ నమః వక్త్రం పూజయామి, ఓం కుంద కుట్మలం దంతయ నమః దంతాన్పూజయామి, ఓం సూర్య చంద్రాగ్ని ధారిణే నమః నేత్రే పూజయామి, ఓం సహస్ర శిరసేనమః శిరః పూజయామి, ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి.

తరువాత అష్టోత్తర శతనామావళి పూజ. ఈ మంత్రములను చదువుతూ పుష్పాలతోగాని, పసుపుకుంకుమలతోగాని స్వామివారిని పూజించాలి.

ఓం నారాయణాయ నమః
ఓంనరాయ నమః
ఓం శౌరయే నమః
ఓం చక్రపానయే నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం వాసుదేవాయా నమః
ఓం జగద్యోనయే నమః
ఓం వామనాయ నమః
ఓం జ్ఞాన పంజరాయ నమః
ఓం శ్రీవల్లభాయ నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం గరుడద్వాజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం స్వయంభువేనమః
ఓంభువనేశ్వరాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం దేవకీపుత్రాయ నమః
ఓం పార్ధసారదియే నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం శంఖపాణయే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం అత్మజ్యోతిషే నమః
ఓం అచంచలాయ నమః
ఓం శ్రీ వత్సామ్కాయ నమః
ఓం అఖిలధారాయ నమః
ఓం సర్వలోక పతిప్రభవే నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం త్రికాలజ్ఞానాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం కరుణాకరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సర్వాంగాయ నమః
ఓం సర్వస్మై నమః
ఓం సర్వేశాయ నమః
ఓం సర్వసాక్షికాయ నమః
ఓం హరయే నమః
ఓం శేషయ నమః
ఓం హలాయుదాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం అక్షరాయ నమః
ఓం క్షరాయ నమః
ఓం గజారి ఘ్నాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం కేశమర్దినాయ నమః
ఓం కైటభారయే నమః
ఓం అవిద్యారయే నమః
ఓం కామదాయ నమః
ఓం కమలేక్షణాయ నమః
ఓం హంసశత్రవే నమః
ఓం అధర్మ శత్రవే నమః
ఓం కాకుత్స్థాయ నమః
ఓం ఖగవాహనాయ నమః
ఓం నీలాంబుదద్యుతయే నమః
ఓం నిత్యాయ నమః
ఓం నిత్యత్రుప్తాయ నమః
ఓం నిత్యానందదాయ నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం నిర్వికల్పాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం బ్రాహ్మన్యాయ నమః
ఓం పృథీ వీనాధ్యాయ నమః
ఓం పీతవాసనే నమః
ఓం గుహశ్రయాయ నమః
ఓం వేదగర్భాయ నమః
ఓం విభవే నమః
ఓం విష్ణవే నమః
ఓం శ్రీమతే నమః
ఓం త్రైలోక్య భూషనాయ నమః
ఓం యజ్ఞమూర్తయే నమః
ఓం అమేయాత్మనే నమః
ఓం వరదాయ నమః
ఓం వాసనానుజాయ నమః
ఓం జితేంద్రియాయ నమః
ఓం జితక్రోదాయ నమః
ఓం సమద్రుష్టయే నమః
ఓం సనాతనాయ నమః
ఓం భక్తప్రియాయ నమః
ఓం జగత్పూజ్యాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం అసురాంతకాయ నమః
ఓం సర్వలోకానామంత్రకాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం అనంత విక్రమాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం నిరాధారాయ నమః
ఓం సర్వధారాయ నమః
ఓం ధరధరాయ నమః
ఓం నిష్కలంకాయ నమః
ఓం నిరాభాసాయ నమః
ఓం నిష్ప్రపంచాయ నమః
ఓం నిరామయాయ నమః
ఓం మహొదరాయ నమః
ఓం పుణ్యకీర్తయే నమః
ఓం పురాతనాయ నమః
ఓం త్రికాలజ్ఞాయ నమః
ఓం విష్టరశ్రవసే నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం సత్యనారాయణ స్వామినే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి.

ధూపం:

 శ్లో      యత్పుమ్శం వ్యవధు:, కతిథావ్యంల్ప యాన్ ముఖంకిమస్య కౌ బాహూ, కావూరూ పాదావు చ్యేతే దశాంగం గగ్గులో పేతం సుగంధంచ మనోహరం ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్క్రుతః

ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః దూపమాఘ్రాపయామి. ధూపం సమర్పయామి. అంటూ ఎడమచేత్తో గంట వాయిస్తూ కుడిచేత్తో అగరవత్తిని తిప్పుతూ పొగను దేవికి చూపించాలి.

దీపం:   

 శ్లో       బ్రాహ్మణోస్య ముఖమాసిత్, బాహూరాజన్యః కృతః, ఊరుతద్య స్య యద్వైశ్యః, పద్బ్యాగ్ శూద్రో అజాయత
ఘ్రుతావర్తి సంయుక్తం విహ్నినా యోజితం ప్రియం, దీపం గృహాణ దేవేశ త్ర్యైలోక్య తిమిరాపహామ్
ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సాక్షాత్ దీపం దర్శయామి.

దీపారాధనలో వున్న మిగిలిన వత్తులలో ఒకదానిని తీసుకొని హారతి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకాన్నిచదవాలి.

నైవేద్యం:

శ్లో       చంద్ర మామతోజాతః చక్షో సూర్యో అజాయత, ముఖాదింద్ర శ్చాగ్నిశ్చ, ప్రానద్వాయు రజాయత, సౌవర్ణ స్థాలిమధ్యే మణగణచితే గోఘ్రుతాక్తా న్ సుపక్వాన్ భక్ష్యాన్ భోజ్యాంశ్చ లేహ్యాన పరిమిత రసాన్ చోష్య మనన్నం నిధాయ, నాశాక్యేరుపేతం దధి మధు సాగుద కశేర పానీయయుక్తం  తాంబూలం చాపి విష్ణో ప్రతిది వ స మా హం మానసు కల్పయామీ రాజాన్నం సూపసంయుక్తం శాక చొ ష్య సమన్వితం, ఘ్రుత భక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యాతాం,

‘ఓం భూర్భువ స్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి,ధీ యో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి,(ఋతం త్వా సత్యేత పరిషించామి అని రాత్రి చెప్పాలి) అమృతమస్తు అమృతో పస్తర ణమసి,ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరుసార్లు చేతితో (చేతిలోని ఉద్ధరిణెతో) స్వామికి నివేదనం చూపించాలి. తరువాత ఓం సత్యనారాయణ నమః నైవేద్యానంతరం ‘హస్తౌ ప్రక్షాళ యామి’అని ఉద్ధరిణెతో పంచపాత్రలోని నీళ్ళు వదలాలి. ‘పాదౌ ప్రక్షాళయామి’ అని మరోసారి నీళ్ళు ఆర్ఘ్య పాత్రలో ఉద్ధరిణెతో వదిలిపెట్టాలి. పునః శుద్ధచమనీయం సమర్పయామి అని ఇంకొక సారి నీళ్ళు వదలాలి.

తాంబూలం:

శ్లో     నాభార్యా ఆసీదంత రిక్షం, శీర్షో ద్యౌ సస మవర్మత, పద్భ్యాభూమి రది సస్శ్రో త్రాత్, తాతాలో కాగ్ అకల్పయన్, పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి అని తాంబూలం (మూడు తమలపాకులు, రెండు వక్కలు, అరటిపండు) పెట్టి స్వామి దగ్గర పెట్టాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుగుకోవడానికి నీళ్ళుఇస్తున్నామని తలచుకుంటూ,’తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి’ అని చెబుతూ, ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదిలిపెట్టాలి . తరువాత కర్పూరం వెలిగించి …

నీరాజనం:

వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమస్సు పౌరే, సారవాని రూపాని విచిత థీరః నామాని కృత్య భి వదన్ యదాస్తే: నర్యప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే, జాతం జనిష్య మానాంచ అమృతే స్టే ప్రతిష్టితాం, ఆధర్వ పితుంమే గోపాయ రస మన్న మహాయుషే, అబద్ధాయో శీతతనో అవిషం నః పితుకృణు, శగ్ స్యశూన్ మే గో పాయ ద్విపాదో యే చతుష్పదః అష్టాష పాశ్చయ ఇహగ్నేయే చిక పాషా ఫా ఆశుగాః సాపన సబం మే గోపాయ ఏచన భయాస్సాభాసదః తవింద్రి యా వతః కురుసవ మాయురుపాసతాం, అహేబుద్నియ మంత్రం మే గోపాయ య ముషాయ స్ర్యైవి దావిదః, రుచాస్సమాని యజూగ్ షిసాహి శ్రీర మ్రుకానతాం, మానోహిగ్ సేజ్ఞా, వేదో గామశ్వం పురుషం జగత్ అబి భర దగ్న ఆగహిషి యా పరిపాతయ, సామ్రాజ్యం చ విరాజ చాభి శ్రీ ర్వా చనో గృహే, లక్ష్మే రాష్ట్ర వ్య యా ముఖే తయామా సగ్ సృజామసి, సంతత శ్రీరస్తు, సర్వమంగళాని భవంతు, నిత్య శ్రీ నిత్య మంగళాని భవంతు.
నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితం, తేజో రాశి మయందత్తం గృహానత్వం నీరాజనం సమర్పయామి.
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః అని కర్పూర నీరాజనం సమర్పయామి. అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి, మూడుసార్లు తిప్పుతూ, చిన్నగా ఘంట వాయించాలి.పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ‘కర్పూర నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి’ అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంట్లోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షింతలు, పువ్వులు, చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని …

మంత్రపుష్పం:

ఓం ధాతా పురస్తాద్యముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రదీ శ శ్చతస్రః తమేవం విద్వాన్ అమృత ఇహభవతి నాన్యః పంధా అయనాయ విద్యతే ఓం సహస్రశీర్హం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ ౦ హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వము పజీపతి పతిం విశ్వస్యా త్మేశ్వరగ్ ౦ శాశ్వతగ్ ౦ శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వత్మాసం పరాయణం నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః నారాయణ పరబ్రహ్మ తత్త్వం నారాయణః పరః నారాయణ పరోధ్యాతాధ్యానం నారాయణః పరః యచ్చకించి జ్ఞగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్భ హిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్ధితం అనంతమన్యయగ్ ౦ కవిగ్ ౦ సముద్రేతం విశ్వశంభువం పద్మ కోశ ప్రతీకాశగ్ ౦ హృదయంచా ప్యదో ముఖం అధో నిష్ట్యా విత స్త్యాన్తే నభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహః సంతతగ్ ౦ శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం తస్యాన్తే సుషిరగ్ ౦ సూక్ష్మంత స్మిన్సర్వం ప్రత తస్యమధ్యే నుహానగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో ముఖఃసోగ్రభుగ్విభ జన్తిష్ట న్నాహార మజరః కవిహ్తిర్యగూర్ధ్వ మధ శ్శాయీర శ్మయస్తస్య సంతతా తాపయతిస్వం దేహమపాద తలమస్తకం తస్యమధ్యేవ హ్నిశిఖా అణీ యోర్ధ్వా వ్యవస్దితఃనీలతో యద మధ్య స్ధాద్విద్యుల్లెఖేవ భాస్వరానీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణుపమా తస్య శిఖాయామధ్యే పరమాత్మా వ్యసస్దితః సబ్రహ్మస్సశివస్సహరి స్స్యేంద్ర స్సోక్షరః పరమస్వరాట్ యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చస్ధ్రమావా అపాం పుష్పమ్ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతియ ఏవం వేద యోపా మాయతనం వేద ఆయతనవాన్భవతి అగ్నిర్వా అపా మాయతనం ఆయతనవాన్భవతియోగ్నే రాయతనం వేద ఆయతనవాన్భవతియోగ్నే రాయతనం వేద ఆయతనవాన్భవతి ఆపోవా అగ్నే రాయతనం ఆయతనవాన్భవతి ఏవం వేదయోపా మాయతనం వే ఆయతనవాన్భవతి వాయుర్వా అపా మాయతనం ఆయతనవాన్భవతి యోవా యో రాయతనం వేద ఆయతనవాన్భవతి ఆపోవై వాయో రాయతనం ఆయతనవాన్భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్భవతి చస్ధ్రమావా అపామాయతనం ఆయతనవాన్భవతి శ్చస్ధ్రమస ఆయతనం వేద ఆయతనవాన్భవతి ఆపోవై చంద్రమస నవమ్ ఆయతనవాన్భవతియ ఏవం వేదయోపా మాయతనం వేద ఆయతనవాన్భవతి నక్షత్రాణి వా అపామాయతనం వేద ఆయతనవాన్భవతి యో నక్ష త్రాణా మాయతనం వేద ఆయతనవాన్భవతి ఆపోవై నక్ష త్రాణా మాయతనం ఆయతనవాన్భవతియ ఏవం వేదయోపా మాయతనం వేద ఆయతనవాన్భవతి సర్జన్యోవా అపా మాయతనం వేద యతనవాన్భవతియః సర్జన్య స్యాయతనం ఆయతనవాన్భవతి ఆపోవై సర్జన్య స్యాయతనం ఆయతనవాన్భవతియ ఏవం వేదయోపా మాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరోవా అపా మాయతనం ఆయతనవాన్భవతి యస్సంవత్సర స్యాతనం వేద ఆయతనవాన్భవతి ఆపోవై సంవత్సర స్యాయతనం ఆయతనవాన్భవతియ ఏవం వేద యోప్సు నావం ప్రతిష్టితాం వేద ప్రత్యేవతిష్టతి కింత ద్విష్నోర్బాల మాహుహ్ కా దేపిహ్ కిం పారాయణంఏకో యద్దారయ దేవః రే జతీ రో దసీ ఉభౌ హ్వాతా ద్విష్నోర్బల మాహుహ్ అక్ష రాద్ది ప్తి రుచ్యతే త్రి పదా ద్దారాయద్దేవః యద్విస్నోరేక్త ముత్తమమ్ ఓం రాజాధి రాజయ ప్రసహ్యాసాహిణే నమోవయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో ద దాతు కుబేరాయ వైశ్రవణాయ మహా రాజాయా నమః ఓం తద్భ్రహ్మ ఓం త ద్వాయుహ్ ఓం త దాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్సురోర్నమః అన్త శ్చరతి భూతే సుగుమాయాం విశ్వ ముర్తిసు త్వం యజ్ఞ స్త్వంవషట్కార స్త్వమిస్ద్ర స్త్వగ్ ౦ రుద్ర స్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిహ్త్వం త దాస అపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోమ్ ఈశాన స్సర్వ విద్యానా మీశ్వర స్సర్వభూతానాం బ్రహ్మధి పతిర్ బ్రహ్మణోధీ పతిర్ బ్రహ్మశివో మే అస్తు సదాశివోం త ద్విష్నోహ్ పరమం పదగ్ ౦ సదా పశ్యన్తి సూరయః దివీ వ చక్షు రాతతం త ద్వి ప్రాసోవిసన్యవో జాగృవా న్సస్సమింధతే విష్ణోర్యత్సరమం పదం అ ద్వైతం విష్ణవే చరుం నిర్వపతి యజ్ఞో వై విష్ణుహ్ యజ్ఞ ఏవాస్తతః ప్రతి తిష్టతి స్తోత్ర జు హొతి ఋతగ్ ౦ సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ద్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వైనమోనమః నారాయణాయ విద్మ హే వాసుదేవాయ ధీ మహీ త న్నో విష్ణుహ్ ప్రచోదయాత్ ఆకాశాత్సతితం తోయం యధాగచ్చతి సాగరం సర్వ దేవ నమష్కారం కేశవం ప్రతి గచ్చతి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

అని చెప్పుకొని అక్షింతలు, పువ్వులు, చిల్లర స్వామిదగ్గర పెట్టాలి. పిమ్మట ఈ క్రింది మంత్రాన్ని జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణ నమస్కారములు:

శ్లో       యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహంపాపకర్మాహం పాపాత్మా పాపశంభవః త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల,అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ,తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష జనార్ధన, ప్రదక్షిణం కరిష్యామి సర్వ బ్రమ నివారణం సంసార సాగారాన్మాం త్వం ముద్ద రస్వ మహాప్రభో, శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ప్రదక్షిణం సమర్పయామి అని చేతిలో అక్షింతలు, పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడుసార్లు ఆత్మప్రదక్షిణ చేసి స్వామికి నమస్కరించి,సాష్టాంగ దండప్రమాణం చేసి తరువాత స్వామిపై చేతిలో ఉన్న అక్షింతలు పువ్వులు నమస్కరిస్తూ వేయాలి.

పునః పూజ:

            ఓం శ్రీ సత్యనారాయణ నమః పునః పూజాంచ కరిష్యే 

అని చెప్పుకుని, పంచపాత్రలోని నీళ్ళను చేతితో తాకి, అక్షింతలు దేవిపై చల్లుతూ ఈ క్రింది మంత్రాలు చదవాలి.
ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి. సమస్త రాజోపచార, శక్త్యోప చార,భక్త్యోపచార పూజాం సమర్పయామి. అనుకొని, నమస్కరిస్తూ ఈ క్రింది శోకాన్ని చదవాలి.

ప్రార్ధన:

శ్లో       అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్య సూదనం, హృషీకేశం జగన్నాధం, వాగీశం వరదాయకమ్. సగునంచ గనాతీతం గోవిందం గరుడధ్వజం, జనార్ధనానం జనానందం జానకీ వల్లభం హరిం, ప్రణమామి సదా భక్త్యా నారాయణ మజం పరం, దుర్గమే విషమే ఘోరే శత్రునా పరిపీడితే, విస్తార యతు సర్వేషు తథా నిష్ఠ భయోశుచ, మామాన్యేతాని సంకీర్త్య ఫల మీప్సిత మాప్నుయాత్, సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వేటటం విశ్వం యేనతస్మై నమోనమః శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ప్రార్ధన నమస్కారం సమర్పయామి.

ఫలం:

శ్లో     ఇదం ఫలం మాయాదేవ స్థాపితం పురుతస్తవ, తేనమే సఫలావాప్తి రభ వే జ్ఞన్మని జన్మవి, శ్రీ సత్యనారాయణ స్వామినే నమః, ఫలం సమర్పయామి.ఏతత్ఫలం శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి అని చెప్పుకుని స్వామి దగ్గరి అక్షింతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకోవాలి. తరువాత పసుపు గణపతి ఉన్న పళ్ళెం ఒకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెంలో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై పెట్టుకోవాలి. (దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ప్రవేశయామి. శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు.

శ్లో      యస్య స్మృత్యాచ నోమోక్త్యాతపః పూజాక్రియాది షు నూన్యం సంపూర్ణ తాం యాతి సద్యో వందే మచ్యంతం మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన, యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తడస్తుతే, అనయా ధ్యాన ఆవహనాది షోడశోపచార పూజయచ భగవాన్సర్వాత్మకః శ్రీ సత్యనారాయణ స్సుప్రీతో వరదో భవతు, శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజావిధానం సంపూర్ణం.

శ్రీసత్యనారాయణ వ్రత కథ

ప్రథమ అధ్యాయము:

పూర్వమొకప్పుడు కొందరు మహామునులు నైమిశారణ్యమున కూడియున్నవారై సూతమునిని జూచి యిట్లడిగిరి. “ఏ వ్రతము చేసిన, తపస్సు చేసిన, కోరిన ఫలములు సిద్ధించునో అట్టి దానిని తెలుపుము” అనిన మహామునులను చూసి సూతముని “ఓ మునులారా! పూర్వమొకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధముగా కోరగా, శ్రీ హరి ఇట్లు చెప్పెను. ఆ విషయమును మీకు తెలిపెదను. శ్రద్ధగా వినుడు” అనెను.

పూర్వమొకప్పుడు నారదమహముని సకలలోకములు తిరుగుచు మర్గామధ్యమున భూలోకమునకు వచ్చెను. అచట మానవులు పడుతున్న కష్టములు చూసి, వీరికి ఈ కష్టములు ఎట్లు తొలగును? అని అలోచించి, విష్ణు లోకమునకు వెళ్లి చతుర్భుజుండు, తెల్లని శరీరచ్చాయ గలవాడు, శంఖము, చక్రము, గద, పద్మము మొదలగు అలంకారములు కలవాడు అగు హరిని చూచి ఇట్లు ప్రార్ధించెను. ‘మనస్సులో ఊహించుటకు గాని, వాక్కుతో వివరించుటకుగాని శక్యముగాని అతీతమైన రూపముగలవాడా ! ఆది మధ్యంత రహితా! గునాత్ముడైనటువంటి ఆ పురుషుడైనటువంటి, భక్తుల బాధలు తొలగించు శ్రీమన్నారాయణా! నీకు భక్తితో నమస్కరించుచున్నాను. శ్రీహరి స్త్రోత్రమును వినినవాడై నారదమహమునితో ఇట్లనెన

‘ఓ నారదా మహామునీ! నేవు వచ్చిన కారణమేమి? నీ కోరిక తెర్చేదను చెప్పుము’ అనెను అంత నారదుడు శ్రీ మహావిష్ణువును జూచి ‘ఓ జగద్రక్షా! భూలోకమున మానవులు నానావిధములుగా కష్టములు పడుచున్నారు. వారలకా కష్టములు ఎట్లు తొలగును, అందుకైన ఉపాయము తెలిపి అనుగ్రహింపుము’ అని ప్రార్దించెను.

అందులకు శ్రీ హరి ఇట్లు చెప్పసాగెను. ‘నారద మహామునీ! నీవు లోకహితార్దమై చక్కని విషయము అడిగితివి.అందులకు ఒక వ్రతము కలదు. అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించువారు, ఇహలోకమున సకలైశ్వర్యములు పొందినవారై పరమున మోక్షమును పొందుదురు’. అది విని నారదుడు ఇట్లు అడుగుచున్నాడు. ‘ఓ దామోదరా! ఆ వ్రతము ఆచరించు విధానమేమి? ఆచరించుట వలన ఏమి ఫలితము కలుగును? దానిని ఇంతకు ముందు ఎవరు ఆచరించిరి? అంతయును వివరముగా తెలుపుము అని కోరగా …
శ్రీ హరి ఇట్లు చెప్పసాగెను. సత్యనారాయణ వ్రతము సకల దుఃఖమును నివారణ చేయును. సకలైశ్వర్యములు గలుగజేయును. సంతానము కలుగును. సర్వత్రా జయము కలుగును. ఈ వ్రతమును వైసఖమాసమందుగాని, మాఘమాసమందుగాని, కార్తీకమాసమునగాని, ఏకాదశి, పూర్ణిమమొదలగు శుభ తిథులయందుగాని, రవి సంక్రమణ దినమున గాని ఆచరించవలెను. కష్టములు సంభవించినప్పుడును, దరిద్రముతో భాదపడుచున్నపుడు ఈ వ్రతము చేయుట మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతమాచరించినచో అట్టి వివాదమున తప్పక జయము కలుగును. ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతినెల ఆచరించవచ్చును. లేదా సంవత్సరమునకొక మారైనను చేయవచ్చును. ఎవరి శక్త్యానుసారము వారు చేయవచ్చును. సూర్యోదయ పూర్వమే నిద్రలేచి కాలకృత్యములను నెరవేర్చుకొని స్నానసంధ్యానుష్టానములు యధాప్రకారము నిర్వర్తించుకొని శుచియై నిశ్చలభక్తితో దేవాధిదేవా! శ్రీ సత్యనారాయణ ప్రభూ! నీ అనుగ్రహము పొందుటకై భక్తీశ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుచున్నాను అని తన మనస్సున ధ్యానము చేసుకొని నమస్కారము చేయవలెను.

ఆ విధముగా సంకల్పముచేసి, మధ్యాహ్న కాలమున కూడా కర్మానుష్టానములు నెరవేర్చుకొని సాయంకాలమున మరల స్నానముచేసి రాత్రి ప్రారంభాకాలమున ఈ వ్రతమును ఆచరించవలెను. పూజా స్థలమును గోమయముతో అలికి శుద్ధిచేసి వరిపిండి మొదలగు అయిదు రంగుల చూర్ణముతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రము పరచి, దానిపై బియ్యము పోసి, దానిపై కలశమును ఉంచవలెను. ఆ కలశమును వెండితోగాని, రాగితోగాని, ఇత్తడితోగాని తుదకు మట్టితో చేయవలెను. లోభత్వము చేయరాదు యథాశక్తి అన్నియు ఆచరించవలెను. ఆసనము మీద మరల క్రొత్త వస్త్రము పరచవలెను. ఆ నూతన వస్త్రము మీద సత్యనారాయణస్వామి ప్రతిమ ఉంచవలెను. ఆ ప్రతిమ ఒక కర్షము బంగారముతో గాని, అర్థకర్షము బంగారముతోగాని లేదా తుదకు పావుకర్షము బంగారముతో నైననూ చేయించి పంచామృతాలతో అభిషేకము గావించి మంటపమున ఉంచవలెను.

ముందు విఘ్నేశ్వర పూజ చేయవలెను. తరువాత లక్ష్మీ దేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహాలను, ఇంద్రాది అష్ట దిక్పాలకులను, అది దేవత ప్రత్యధి దేవతాయుతముగా పూజించవలెను.విఘ్నేశ్వరుడు మొదలగు ఐదుగురు దేవతలను కలశమున కుత్తరమున మంత్రముతో ఉత్తర సమాప్తిగా ప్రతిష్టించి పూజచేయవలెలను. తరువాత అష్ట దిక్పాలురను తూర్పు, మొదలగు ఎనిమిది దిక్కులయందు ప్రతిష్టించి పూజచేయవలెను. పిదప సత్యనారాయణస్వామి కలశము మీద పూజచేయవలెను. నాలుగు వర్ణములవారును స్త్రీలును పురుషులును కూడా ఈ వ్రతమును ఆచరించవలెను. బ్రాహ్మణులు పౌరాణికముగాను, వైదికముగాను కూడా ఈ వ్రతమును ఆచరించవలెను. బ్రాహ్మణులు కానివారు పౌరాణికముగానే వ్రతమును ఆచరించవలెను.
తుదకు ఏదినమైననూ సాయంకాలము ఈ వ్రతమును ఆచరించవచ్చును. వ్రతమును చేయువారు బ్రాహ్మణులను,బంధువులను పిలుచుకోని వచ్చి చేయవలెను. అరటిపండ్లు, ఆవునెయ్యి, ఆవుపాలు, గోధుమనూక అది లేనిచో బియ్యమునూక, చక్కెర లేనిచో బెల్లము ఇవన్నియు సమానముగా అనగా సేరుంబావు చొప్పున చేర్చి, ప్రసాదమును తయారుజేసి స్వామికి నివేదన చేయవలను. ఈ విధముగా నైవేద్యము జరిగించిన పిమ్మట బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదుల తోడను, బ్రాహ్మణుల తోడను కలిసి భోజనము చేయవలెను.సత్యనారయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదికములను జరిపించవలెను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామితార్ధములను బడయుటకు మిక్కిలి సులభమైన మార్గము.

ద్వితియ అధ్యయము:

ఓ మునిశ్రేష్టులారా! పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెప్పుచున్నాను వినుడు. పూర్వము కాశీ నగరమున ఒక బ్రాహ్మణుడుండేడి వాడు. అతడు మిగుల దరిద్రుడగుటచే అన్నవస్త్రములు లేక ఆకలి భాధపడుచు ప్రతి ఇల్లు తిరుగుచుండెడి వాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు దుర్భరమైన కష్టమును అనుభవించుట చోఇ తానూ ఒక వ్రుద్ద బ్రాహ్మణ రూపమును పోమ్దినవాడై ఆ బెడ బ్రహ్మనునకు ఎదురుగ పోయి ‘ఓయీ బ్రాహ్మణుడా! నీవు వేద విదురుడవై యుండి ఇట్లు దరిద్రముననుభవించుచు తిరుగుచుంటివేమి? అని అడుగగా ప్రభూ నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటన చే జీవించుచున్నాను, చాల కష్టములను అనుభవించుచున్నాను. అతడు బ్రాహ్మణుడా! శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారము. ఆ సత్య దేవుని సేవించినచో నీ కష్టములెల్ల తొలగిపోవును. కనుక నీవు ఆ సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరింపుమనెను. వ్రాత విధానమును చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు అచ్చటనే అంతర్ధాన మయ్యెను.

వెంటనే ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణవ్రతమును రేపు చేసెదను అని మనసున సంకల్పించి, నాటి రాత్రి ఉత్సాహమున నిదురరాక ఎట్లో గడిపి మరునాడు ప్రాతః కాలమున లేచి నిత్యకృత్యములు నేరవర్చుకొనినవాడై ఈ రోజు తప్పక వ్రతమాచ రించవలెను. మనస్సున దృడముగా నిశ్చయించుకొని బిక్షాటనకు బయలుదేరెను. ఆదినమున బ్రాహ్మణునకు ఎన్నడు రానంత ద్రవ్యము లభించినది. అతడు బంధువులను పిలిచి భక్తీశ్రద్ధలతోసత్యనారాయణ వ్రతమును ఆచరించేను. వ్రత ప్రభావము వలన బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలిగి, సకల సంపదలు పొందిచాల సంతోషించెను. అది మొదలు ప్రతిమాసమునాను విడువక సత్యనారాయణ వ్రతమును భక్తిశ్రద్ధలతో చేయుచుండెను. ఆ విధముగా చేయుట వలన ఆ బ్రాహ్మణుడు మహాదైశ్వర్య వంతుడగుటయేగాక సకల పాపముల నుండి విముక్తుడై అంత్యమున మోక్షమును పొందెను. ఈ వ్రత మాచరించినవారు సకల దుఃఖముల నుండి విముక్తిని పొందినవారై సుఖముగా నుందురు.

ఓ మునులారా! ఆ విధముగా శ్రీ హరి నారదునకు చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలిపితిని. అని సూతులవారు చెప్పిరి. మరల ఆ మునులు వారితో యిట్లనిరి. ఆ బ్రాహ్మణుని వలన ఎవరు ఈ వ్రతమును చేసిరో సవిస్తరముగా తెలుపుమనిన సూతులవారు ఇట్లు చెప్పుచున్నారు. ఓ ములారా! ఆ వ్రతము ఎవరిచే చేయబడినదో చెప్పుచున్నానని వినుడు. ఒకప్పుడు ఒక ఆబ్రాహ్మణుడు ఈ వ్రతమాచరించుచుండెను. భక్తీ శ్రద్ధలతో బంధువులు, సర్వజనులు వచ్చి ఆనందముతో వ్రతకథ వినుచుండిరి. ఆ సమయమున ఒకకట్టెలమ్మునతడు మిగుల అసకలిదప్పులతో నుండియు బ్రాహ్మణుడు చేయుచున్న దంతయు చూచి, ‘ఓ మహాత్మా! మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతము చేసిన ఏమి ఫలితము వచ్చును? దయతో సవివరముగా తెలుపుము అని పార్ధించెను. అపుడు ఆ బ్రాహ్మణుడు ‘ఓయీ!సత్యనారయణ వ్రతము. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును. సకలైశ్వర్యములు కలుగునని తెలుపగా కట్టెలమ్మువాడు మిగుల సంతసించి దాహము తీసుకొని, ప్రసాదమును గ్రహించి భోజనం చేసిన పిమ్మట యింటికి వెడలిపోయెను.

కట్టెలమ్మునతడు సత్యనారాయణ వ్రతము చేయుటకు నిశ్చయించుకొని మరునాడు పుల్లల కావడి భుజముపై పెట్టుకొని ఈ దినము ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించి సత్యనారయణ వ్రతము చేసెదను అని సంకల్పించుకొని పట్టణములోనికి బయలుదేరెను. అతడు ఆ దినము ధనవంతులుండు వీథికి పోయి అమ్మగా పూర్వము కంటే రెట్టింపు ధనము వచ్చెను. అతడు మిగుల సంతోషించి అరటిపండ్లు, చెక్కెర, నెయ్యి, పాలు, గోధుమనూక మొదలగునవి తీసుకొని యింటికి చేరెను. తరువాత అతడు తన బంధుమిత్రాదులను ఆహ్వానించి యధావిధిగా సత్యనారాయణ వ్రతము నాచరించెను. ఆ వ్రత ప్రభావము వలన అతడు ధనమును, పుత్ర, పుత్రికలను పొంది జీవిత కాలమంతయు సకల సుఖములననుభవించి అంత్యము సత్యలోకమున పోందెను.

తృతీయ అధ్యాయము:

ఓ మునిశ్రేష్టులారా! ఇంకొక కథను చెప్పెదను వినుడు. పూర్వము ఉల్కాముఖుడను ఒక రాజు ఉండెడి వాడు. అతడు ఇంద్రియములను జయించినవాడు, సత్యవ్రతుడు. అతడు ప్రతిదినము దేవాలయమునకు పోవుచూ, బ్రాహ్మణులకు ధనమిచ్చి, సంతోషపెట్టుచుండెను. ఆతడి భార్య చాలా సౌందర్యవతి మంచిగుణములు కలది. ఆ రాజు ఇట్లు వ్రతము చేయుచుండగా ‘సాధువను’ ఓ వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారమునకై ఆ మార్గమున పోవుచు రాజు చేయుచున్న వ్రతమును చూచి, తన పడవను ఒడ్డునకు పంపించి రాజు వద్దకు పోయి ఇట్లు అడిగెను. ‘ఓ రాజా! నీవిప్పుడు ఆచరించుచున్న వ్రతమును గూర్చి సవివరముగా నాకు తెలుపగోరుచున్నాను.దయతో నాకు చెప్పుమనగా రాజు ఇట్లు చెప్పెను. ‘ఓయీ! పుత్రులు పొందుటకై మేము శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచున్నాము. ఈ వ్రతము చేయుటవలన సకల కార్యములు సిద్ధించునని వ్రత మాచరించు విధానమును చెప్పెను.

వైశ్యుడు అంతయును విని ‘రాజా! నాకును సంతానము లేదు. కనుక నేను కూడా ఈ వ్రతమును ఆచరించి సంతానము బడయును అని పలికి, తన వ్యాపారము పూర్తి చేసుకొని తన భార్యయైన లీలావతికి వ్రతమును గురించి చెప్పి, నాకు సంతానము కలిగినచో తప్పక ఈ వ్రతము నాచరించుదునని ప్రతిజ్ఞ చేసెను. ధర్మ పారాయణమై భర్తతో సుఖించిన లీలావతి గర్భవతి అయి ఒక కుమార్తెను కనెను. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు ‘కళావతి’ అని నామకరణము చేసి, అల్లారుముద్దుగా పెంచుచుండిరి. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమగుచుండెను. అప్పుడు లీలావతి తన భర్తను చూచి, ‘నాథా! మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతము చేసెదనని ప్రతిజ్ఞ చేసితిరి గదా! మనకు సంతానము కలిగినది కనుక వ్రతమును చేయుడ’ని పలికెను. అందులకతడు అమ్మాయి వివాహ కాలమున వ్రతమును చేసెదను అని వ్యాపారమునకు పట్టణమునకు పోయెను. కొంత కాలమునకు కళావతికి యుక్త వయస్సు వచ్చినది. ఒక దూతను పలిచి నీవు పోయి అమ్మాయికి తగిన వరుని వెదికి చూచి రమ్మని చెప్పెను.సాధువను ఆ వైశ్యుడు అట్లు చేపగా, ఆ దూత కంచన నగరమునకు పోయి యోగ్యడైన ఒక వైశ్య కుమారుని జూచి తీసుకొని వచ్చెను. సాధువు అన్ని విధముల తన కుమార్తెకు తగినవాడు అగుట జూచి, ఆ వైశ్య కుమారునకు తన కుమార్తెనిచ్చి వైభవముగా పెండ్లి చేసెను. ఆ ఆనందములో ఆ వైశ్యుడు సత్యనారాయణ వ్రతము విషయము మరచెను.శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపము వచ్చెను. అప్పుడు వ్యాపారమున బహు నిపుణుడైన ఆ వైశ్యుడు అల్లునితో కూడి వ్యాపారము నిమిత్తము బయలుదేరి సముద్ర తీరమునగల రత్నసాను పురమునకు పోయెను. ఆ రత్నసాను పురమును చంద్రకేతు అను మహారాజు పరిపాలించుచుండెను. సాధువు తన వ్రతము చేయకుండుట చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడై అతనిని శపించెను. వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక అని శపించెను. ఆ రాత్రి కొందరు దొంగలు రాజుగారి ధనాగారము నుండి కొంత ధనమును అపహరించి ఆ వర్తకులు ఉన్న చోటికి చేరుకొనిరి.

రాజభటులు ఆ దొంగలను పట్టుకొనుటకు నలుమూలల వెతుకుచూ తమ దగ్గరకు వచ్చుచుండుట చూచి ఆ దొంగలు ధనమును ఆ వర్తకుల చెంత వదలి పారిపోయిరి. రాజభటులు ధనము అక్కడ యుండుట చూచి ఆ వైశ్యులే దొంగలని నిశ్చయించి వారిని కట్టి రాజుకడకు గొనిపోయిరి. భటులు రాజును చూచి “ప్రభూ! ధనముతో గూడ చోరులను బట్టి తీసుకొని వచ్చితిమి. విచారించి తగిన శిక్ష విధింపుడు”అని విన్నవించిరి. రాజు ఏమియు విచారింపక వీరిని తీసుకొని పోయి కారాగృహమున ఉంచుడు అని జ్ఞాపించెను. భటులు వైశ్యులను తీసుకొని పోయి కారాగృహమున బంధించిరి.

వారందరూ అట్లు దుఖించుచుండగా తన కుమార్తెను చూచి అల్లుడా! చూచుచుండగానే నావతో గూడ మునిగితివి గదా ఇది అంతయు సత్యనారాయణ స్వామి మహత్యము అని తలచుకొనుచు కుమార్తెను కౌగలించుకొని విలపింపసాగెను.కలావతి తన భర్త చనిపోవుట చూచి, అతని పాదుకులను గైకొని వాటితో సహగమనము చేయుటకు సిద్ధపడెను.వైశ్యుడు అది చూచి దుఖించుచూ ఇదంతయు సత్యనారాయణ స్వామి మహాత్యముగాని, వేరుకాదని నిశ్చయించుకొని అందరను పిలచి తన అభిప్రాయము చెప్పి స్వామికి సష్టంగా నమస్కారము చేసి వేడుకొనెను.

అంత సత్యనారాయణస్వామి వైశ్యుని పై కరుణ వహించి ‘ఓ వైశ్యుడు! నీ కుమార్తె నా ప్రసాదము భుజిమ్పకుమ్డ భర్తను చూచుటకు వచ్చినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదము తీసుకొని వచ్చినచో అంతయూ శుభమగునని చెప్పెను’. ఆ విధముగా ఆకాశమునుండి వినబడిన మాటలు విని కాలావతి వెంటనే యింటికి పోయి స్వామీ ప్రసాదము స్వీకరించి వచ్చెను. ఆమె తిరిగి సముద్ర తీరమునకు వచ్చుసరికి తన భర్త నావతో గూడ పైకి తేలి యుండెను. అది చూచి అందరను చాలా ఆనందించిరి. అప్పుడు కలావ్త౯ఇ తండ్రిని చూచి తనదీ ఇంకను ఆలస్యమేల ఇంటికి పోవుదము రమ్మనెను. అపుడా వైశ్యుడు బంధుమిత్రాదులతో కలసి అక్కడనే సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించి, పిమ్మట సుఖమగా ఇల్లు చెరుకొనెను. తరువాత్ ఆ వైశ్యుడు బ్రతికి యున్నంత కాలము పౌర్ణమి తిథి యందును, రవిసంక్రమణ దినమందును శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచు బ్రతికి యున్నంత కాలము సకల సుఖములు అనుభవించి అంత్యమున సత్యలోకమును పొందెను.

చతుర్ధో అధ్యాయము:

సూతమహర్షి చెబుతున్నాడు. అటుపిమ్మట వైశ్యులిద్దరు, విప్రులకు దానధర్మములొసంగి తీర్ధయాత్రలు చేయుచు స్వనగరమునకు బయలుదేరాడు. సముద్రమునందు వారావిధముగా కొంతదూరము ప్రయాణము చేసిరి సత్యదేవునికి మరల వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే సన్యాసి రూపమును ధరించి “నాయనలారా! మీ పడవలో ఏమున్నది” అని అడిగాడు. ధనమదాంతులైన ఆ వైశ్యులు, సన్యాసిని జూచి పరిహసిస్తూ మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనమును అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు,అలములు తప్ప మరెమియు లేవు. వెళ్ళమని బదులు చెప్పారు. అంతట సన్యాసి చిరునవ్వునవ్వి “అట్లే అగుగాక” అన్నాడు. 

అట్లు పలికిన ఆ సన్యాసి నదీతీరమునందే కొంతదూరములో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అలావెళ్ళగానే సాధువర్తకుడు కాలకృత్యములు తీర్చుకునివచ్చి, పడవలోనికిజూచి,ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్చిల్లాడు, తెలివివచ్చిన తరువాత తమ ధనధాన్య సంపదలన్నీ ఏమైపోయినవోనని విలపించసాగాడు. అంతట అల్లుడు మామనుజూచి “మామయ్యా! ఏడ్వటంవలన ప్రయోజనమేమి? సాధుగుణాత్ముడైన సన్యాసిని పరిహసించినందువలననే మనకీ దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపంవల్లనే సర్వస్వం కోల్పోయాము. కనుక ఆయననే వేడుకొందాం. ఆయననే శరణు కోరుదాం. మనల్ని తప్పక కరుణిస్తాడు. మన కోరికలు నెరవేరగలవు” అన్నాడు. అల్లుని మాటలనాలకించిన సాధువు పరుగుపరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయముతో “స్వామి! ఙ్ఞానశూన్యుడనై మిమ్ములను పరిహసించాను. నా తప్పును మన్నించండి. క్షమించి నాపై దయ చూపండి” అని పరిపరివిధాలుగా ప్రార్ధించాడు. భోరున విలపించాడు. అంతట ఆ సన్యాసి “ఓయీ! నా వ్రతము చేసెదనని చెప్పి మరిచిపోవుట భావ్యమ! దుష్టబుద్దితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే నేను శాపము ఇచ్చాను. నా శాపంవల్లనే నీకీ దుస్థితి సంభవించింది. యిప్పటికైనా తెలుసుకొంటివా! అన్నాడు. 

అంతట సాధువు “స్వామీ! పుండరీకాక్షా! లోకమంతయు నీ మాయమోహమున పడి కొట్టుమిట్టాడుచున్నది. బ్రహ్మాదిదేవతలే నీ మాయనుగానలేకున్నారు.నిన్ను తెలుసుకొనలేకున్నారు. మానవమాత్రుడను, నేనెంతవాడను తండ్రీ! నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అఙ్ఞానిని. నీ అనుగ్రహమునకు దూరమై తపించుచున్న అభాగ్యుడను నిన్ను తెలుసుకొనుట నా తరమ స్వామీ! నా అపరాధమును మన్నింపుము. ఇకమీదట నిన్నెపుడు మరువక పూజించెదను. శరణన్నవారిని రక్షించు కరుణాసముద్రుడవు, నన్ను అనుగ్రహించు నా విత్తమును నాకిప్పించమని” పరిపరివిధాలుగా ప్రార్ధించాడు. సాధుయొక్క ప్రార్ధనను మన్నించిన స్వామి ఆతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యెను. అటుపిమ్మట సాధువు తన నావవద్దకు వచ్చిచూడగా అది అంతయు ధనరాశులతో నిండియుండుటను గమనించి సంతుష్ఠాంతరంగుడై ఆ సత్యదేవుని దయవల్లనే తనకోరిక తీరినదనుకొని తన పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహమునకు ప్రయాణము సాగించెను. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లునితో “అల్లుడా! మనం మన రత్నపురమునకు చేరాము” అంటూ తమ రాకను తెలుపుటకై ఒక దూతను ఇంటికి పంపెను.ఆ దూత నగరానికిపోయి లీలావతితో అమ్మా! నమస్కారము, మన అయ్యగారు, అల్లుడుగారు వచ్చారు. బంధుమిత్రాదులందరితో కలిసి వేంచేసారు. ఇప్పుడే పడవవచ్చింది. అని వార్తను చెప్పాడు.  అంతట లీలావతి, దూతమాటలు విని ,సంబరపడి, అమ్మాయీ కళావతీ! సత్యనారాయణవ్రతం త్వరగా ముగించిరామ్మా! నేను నావ వద్దకు పోవుచున్నాను, నీ తండ్రిని, భర్తను చూచుటకు త్వరగా రా! అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతము ముగించి ప్రసాదాన్ని భుజించటం మరచి పరుగుపరుగున తన పతిని జూచుటకు పోయింది. ప్రసాదాన్ని ఆరగించనందుకు సత్యదేవుడు కోపించి ధనమును సంరక్షిస్తున్న అల్లునితోసహా పడవ నీటిలో మునిగిపోయేటట్లు చేసాడు. అదిచూసి ఒడ్డునున్నవారు హాహాకారాలు చేసారు. లీలావతి, కళావతి మిక్కిలి దుఃఖించసాగారు.హఠాత్తుగా పడవ మునిగిపోవుటను జూచిన తల్లి నెత్తినోరూ బాదుకుంటూ, విలపిస్తూ, భర్తతోఇట్లన్నది. “ఏమండి! అల్లుడు అంత హఠాత్తుగా పడవతోసహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక మరేమిటి? అంటూ దుఃఖపడసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు పడిపడి ఏడ్వసాగింది. తన భర్త తనకళ్ళెదుట మునిగిపోవుటను జూచిన కళావతి అతని పాదుకలను తీసుకొని, వాటితో సహా సహగమనము చేయటానికి సిద్దపడింది. సాధువు ఇదంతయుజూచి, మిగులదుఃఖించుచు, ఆలోచించి, “ఇదంతా స్వామి మహిమే అయివుంటుందని” ఊహించి శక్తికొలది స్వామిని పూజించెదనని తలంచి అందరితోబాటు స్వామిని వేడికొనసాగాడు. అంతట స్వామి సాధువును కరుణించి అదృశ్యరూపములో ఉండి అతనితో ఓయీ! నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో నాప్రసాదమును ఆరగించుట మరచినది. ఆమె మరల ఇంటికిపోయి ప్రసాదమును భుజించివచ్చినచో అంతయు శుభమే జరుగునని చెప్పాడు. ఆకాశవాణి పలుకులువిన్న కళావతి, వెంటనే ఇంటికివెళ్ళి ప్రసాదాన్ని పుచ్చుకొని తప్పును మన్నించమని వేడుకొని తిరిగి సముద్రతీరమునకు వచ్చెను. ఆశ్చర్యముగా తనభర్త నావతోసహా నీటిపై తేలియుండుటజూచి సంతోషపడింది. అందరు ఆనందించారు. అంతట కళావతి తండ్రితో “తండ్రీ! ఇక ఆలస్యమెందుకు? ఇంటికి పోవుదమురమ్ము” అనెను అంతట సాధువు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతము చేసికొని ఇంటికి పోయాడు. అటుపిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతకాలమువరకు ప్రతి పౌర్ణమి తిధియందును, రవిసంక్రమణ సమయమందును, సత్యనారాయణస్వామి వ్రతము చేస్తూ సర్వసౌఖ్యములనంది అంత్యమున అమరలోకానికేగాడు. 

పంచమా అధ్యాయము:

సూతమహాముని మరలా యిట్లు చెప్పదొడగెను. ‘ఓ మునీంద్రులారా! మరియొక కథ చెప్పెద వినుడు. పూర్వము తుంగధ్వజుడు అను రాజు ప్రజలను కన్న బిడ్డలవలే చూచుకోనుచు రాజ్యపాలనము చేయుచుండెను. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి ఇంటికి వచ్చుచు మార్గములో ఒక మారేడు చెట్టు క్రింద గొల్లలు బంధువులతో కూడుకొనిన వాడై వ్రతము చేయచుండుట చూచియు మనోగర్వముతో స్వామికి నమస్కారము చేయక ప్రసాదము స్వీకరించక వెడలిపోయెను. తరువాత గొల్లలు ప్రసాదము తెచ్చి రాజు ముందర యుంచి మరల పూజాస్థలమునకు పోయి అందరను భక్తితో ప్రసాదము భుజించిరి. రాజు ఆ ప్రసాదమును భుజింపకనే తన నగరమునకు వెడలిపోయెను. అందులకు సత్యనారాయణస్వామికి రాజుపై ఆగ్రహము కలిగి,దానివలన రాజుయొక్క నూర్గురు కుమారులు చనిపోయిరి. సకల సంపదలు హరించెను. క్రమముగా దరిద్రము సంభవించెను. తరువాత అనేక కష్టములు సంప్రాప్తించెను.

Know More Ekadashi Mahatmya Aur Vrat Vidhi

రాజు తనలో తానిట్లనుకొనెను. ‘ఆహా! గొల్లలు యిచ్చినారని నీచముగా భావించి స్వామి ప్రసాదమును బక్షింపక తిరస్కరించితిని. అందుచే సత్యదేవునకు నాపై ఆగ్రహము కలిగి నాకిట్టి స్థితి కలిగినది ఆలోచించుకొని వెంటనే పోయి ఆ గొల్లల చెంతకు పోయి భక్తీశ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించెను. పిదప ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తిని పొంది పుత్రవంతుడై బ్రతికి యున్నంత కాలము సుఖముగా ఉండి అంత్యమున సత్యలోకమునకు పోయెను.

మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తిశ్రద్ధలతో ఎవరు ఆచరింతురో ఎవరు ఈ కథ భక్తీ తో విమ్డురో వారు సకల సంపదలు పొందినవారై సుఖముగా నండూరు. దరిద్రుడు ధనవంతుడగును. బంధనము పొందినవాడు విముక్తిని పొందును.భయగ్రస్తునకు భయము తొలగును. సకల అభీష్టములు పొందినవారై అంత్యమున సత్యలోకమునకు పోవుదురు. కనుక సత్యనారాయణ వ్రతము చేయవలసిన ఆవశ్యకమును, వ్రత విధానమును, ఆ వ్రతము యొక్క మహత్యమును అందువలన లభించు ఫలితమును వివరించెను.

కలియుగమున సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. కొందరు సత్యనారాయణు డనియు, కొందరు సత్యదేవుడనియు పిలిచుకొనుచున్నారు. సనాతనుడైన హరి కలియుగమున అనేక అవతార రూపములు ధరించి భక్తులను కాపాడును. వారి కోర్కెలు తీర్చుచుండును. వ్రతము చేయుటకు శక్తి లేకున్నను ఎవరైనా ఈ వ్రతమును చేయుచుండగా చూచిననూ, భక్తీ శ్రద్ధలతో కథ విన్ననూ, సత్యదేవుని అనుగ్రహమువలన సకల కష్టములు తొలగిపోవును. సకల సంపదలు కలుగును.

ఇతి శ్రీ స్కాందే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం సమాప్తః

పునఃపూజ – పునః ప్రానానాయామ్య – శ్రీ సత్యనారాయణ ముద్దిశ్య శ్రీ సత్యనారాయణ స్వామి ప్రీత్యర్ధం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పునః పూజాం కరిష్యే, శ్రీ సత్యనారయణ స్వామినే నమః ధ్యాయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాదయః పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, స్నాపయామి, శుద్ధచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, దివ్య శ్రీ చందనం సమర్పయామి,అక్షతాన్ సమర్పయామి, నానావిధ పుష్పాణి పూజయామి, ఓం కేశవాయ నమః …. దూపమా ఘ్రాపయామి, దీపం దర్శయామి ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి.

నైవేద్యం – ఓం భూర్భువస్సువః ………. ప్రచోదయాత్. సత్యంత్వర్తేన పరిషించామి శ్రీ సత్యనారాయణస్వామినే నమః అమృతమస్తు అమృతో పస్తరిణమసి.

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….